19, మార్చి 2014, బుధవారం

గెయిల్ ట్రేడ్వెల్ - హోలీ అండ్ హెల్


గెయిల్ అనే ఆస్ట్రేలియాకు చెందిన వనిత తను మాతా అమృతానందమయి (సుధామణీ)ఆశ్రమంలో ఎలా చేరింది, 20 సంవత్సరాల తరువాత ఎలా తప్పించుకుంది, అక్కడ ఆవిడ అనుభవించిన నరకం, 'అమ్మ' కొట్టిన దెబ్బల తిట్టిన తిట్ల  తాలూకు వివరాలు   తన డైరీలో రాసుకున్న సంఘటనల ఆధారంగా ఇటీవల విడుదలైన పుస్తకమే  "హోలీ హెల్".  


కేరళ ఆశ్రమంలో తాను పడ్డ కష్టాలు, అక్కడ జరిగే దోపిడి మొదలగు విషయాలు కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో వివరించింది.   ప్రస్తుతం మన దేశంలో వున్న బాబాలు వారి వికృత చేష్టలు చూసిన తరువాత గెయిల్ రాసిన దాంట్లో వాస్తవం వుందని నమ్మవలసి వస్తుంది.     


హిందూ మతంలోని బలహీనతలను ఆసరాగా చేసుకొని స్వామి నిత్యానంద, పిరమిడ్ పత్రీ , అమ్మా భగవాన్,  కర్నూల్ జూనియర్ బాబా, ఆసారాం బాపు, ఒంగోలు దగ్గరలో ఆశ్రమం కట్టుకున్న ఇంకో భూ కబ్జాదారుడు రామ అవధూత  లాంటి వారు భక్తి పేరిట కోట్లు గడిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.    పనిలో పనిగా సినిమా వాళ్ళు, ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ అధికారులు, రాజకీయ నాయకులు వీరిని దర్శనం చేసుకొని ఆ ఆశ్రమానికి లేని గుర్తింపు తెస్తారు.  


కొంత కాలం క్రితం ఒక ఛానల్ వారు అమ్మా భగవాన్ ఆశ్రమంలో జరిగే వికృత చేష్టలు రోజంతా పదే పదే చూపించారు.   తరువాత ఏమి జరిగిందో ఏమో, ప్రభుత్వమూ చర్య తీసుకోలేదు, టి వి వారు మర్చిపోయారు.  


ఈ పుస్తకంలో అక్కడక్కడ కొన్ని అభ్యంతరకరమైన, అసభ్య రాతలున్నప్పటికి, కేరళలోని ప్రముఖ ఆశ్రమం పుట్టుక దాని ఎదుగుదల ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి వుంటే చదవచ్చు. 

1 కామెంట్‌ :

  1. పిరమిడ్ పత్రి ఏం చేశిండు మధ్యలో.. నీ తెలంగాణ తిక్క ఇక కుదరదు కాబట్టి ఇలా ఏదో ఒకటి పట్టుకుంటున్నవా..ఉత్తంతీ

    రిప్లయితొలగించండి