4, జనవరి 2014, శనివారం

సభలో చర్చ మరియు ఓటింగ్ జరగాలి


శాసన సభలో పునర్విభజన బిల్లుపై సత్వరం చర్చ జరగాలి.   అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలను నమోదు చెయ్యాలి.   చర్చ జరిగినా జరగక పోయినా జనవరి 23 తరువాత శాసన సభ తమ అధికారాన్ని కోల్పోతుంది.   చర్చ జరపకుండా అడ్డుకుంటున్న వాళ్ళంతా విభజనను సమర్ధిస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది.   ఆర్టికల్ 3 ప్రకారం ఈ తతంగాన్ని పూర్తి చేసే సర్వాధికారం కేంద్రానికే వుంది.   కనీసం చర్చ జరిగితే సభ్యుల అభిప్రాయాల ప్రకారం కొన్ని విషయాలనైనా కేంద్రం పరిశీలించే అవకాశం వుంది.   ప్రస్తుత పరిస్తితులలో కాంగ్రెస్ పార్టీకి తీర సీమంధ్ర లోని 25 స్థానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు.   అలాంటప్పుడు సోనియా గాంధీ బొమ్మలు తగులబెట్టి ఆమెతో ఆమె పార్టీతో వైరుధ్యం పెంచుకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం వుంది.   మొండివాడు రాజుకంటే బలవంతుడు అనే నానుడి మనకు తెలియంది కాదు.   

తక్షణ కర్తవ్యం శాసన సభలో బిల్లుపై సంపూర్ణంగా చర్చించి, తగు సవరణలు ప్రతిపాదించి  ఆపై  ఓటింగు జరిపి, అలా వీగిపోయిన బిల్లును రాష్ట్రపతికి పంపడం ఉత్తమం.  ప్రతిపక్షం అధికారపక్షం కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి