23, జనవరి 2014, గురువారం

చర్చకు గడువు పెంచకపోవచ్చు


రాష్ట్ర పునర్విభజన బిల్లుకు గడువు పెంచే అవకాశాలు తక్కువగానే వున్నాయి.  గడువు పెంచమని సభాపతి కూడా విజ్ఞప్తి చేస్తే ఆ విషయాన్ని గౌరవ రాష్ట్రపతి కూడా తీవ్రంగా పరిశీలించి వుండేవారు.   సాధారణంగా, సభలో అందరు సభ్యుల ప్రసంగం ముగుసిన తరువాత చివరిగా సభా నాయకుడు ప్రసంగిస్తారు.   ఇంతవరకూ బాబు గారు మాట్లాడలేదు.   బహుశా గడువు పొడిగించరనే అనుమానంతోనే ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. గడువు పొడిగించకపోతే మనము  చంద్ర బాబు గారి ప్రసంగం వినే అదృష్టం కోల్పోతాము.    హడావుడిలో ఓటింగుకు కూడా అవకాశం వుండదు.   ఇంతవరకూ వచ్చాక విభజన ఆగుతుంది అనిగాని, ఆగిపోవాలని కోరుకోవడం కానీ అర్ధం లేదు.    నిర్ణయం ఏదైనా, ఇరు ప్రాంతాలలోని సామాన్యుడు నష్టపోయాడు గాని, ఒంగోలులో వందల ఎకరాలు కొన్న వీర సమైక్య వాదులకొచ్చిన నష్టం ఏమీ లేదు.      

1 కామెంట్‌ :