2, జనవరి 2014, గురువారం

మన రాష్ట్రంలో చట్టం అమలులో వుందా?



గత మూడున్నర సంవత్సరాలుగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, ప్రతి నాయకుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.  ఒక నాయకుడు మానవ బాంబు అవుతానంటాడు, ఇంకొకాయన రైళ్ళు పడగోడతాను అని, ఇంకొక ఎంపీ గారు లేటెస్ట్ గా ముఖ్యమంత్రిని కాల్చేస్తా అని మీడియా ముందు రెచ్చిపోతున్నాడు.   గతంలో బాగా చదువుకున్న ప్రొఫెసర్ గారు, నక్సలైట్లచే చంపబడిన మాజీ  సభాధ్యక్షులు శ్రీపాదరావు గారికి పట్టిన గతే ఆయన తనయుడు మంత్రి శ్రీధర బాబు గారికి పడుతుందని హెచ్చరించారు.   

ఒక ప్రాంతం వాడు ఇంకొక ప్రాంతానికి రాకూడని ఫత్వాలు జారీ చేయడం సర్వసాధారణమైంది.   అన్ని పార్టీల నాయకులు వాళ్ళ పిల్లల్ల్ని శత్రు ప్రాంత పిల్లలతో ఇచ్చి పుచ్చుకున్నారు.   కేవలం వారు మాత్రమె సరిహద్దులు దాట  వచ్చు.   ఇలాంటి భయాందోళనలు రేకిత్తించడం వలననే తెలంగాణా ఏర్పాటులో జాప్యం మరియు అధికారాల కేంద్రీకరణ.    ప్రజాస్వామ్య హరణకు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.  

తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, ఇలాంటి పరిస్తితికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బాధ్యులే.   మితిమీరిన ప్రజాస్వామ్యం పరిపాలనకు చేటు కలిగించేదే.     ఈ వికృత రాజకీయ క్రీడకు కనీసం 2014 మార్చిలో నన్నా తెర దించితే ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు.        

2 కామెంట్‌లు :

  1. పొన్నం ప్రభాకర్ గారూ, నోరు అదుపులో పెట్టుకోండి.

    రిప్లయితొలగించండి
  2. andarin antune evarini corner chesthunnavo neeku teliyadam ledaa sodaraa .. yadalapangaa anna matalanu mee nadhra media entha pracharam cjesthundho maku teliyadaaaaa :)

    రిప్లయితొలగించండి