5, జనవరి 2013, శనివారం

ధ్యాస శ్వాస మీద కాదు డబ్బు మీద

 
అమ్మ భగవాన్, పత్రీ'జీ', స్వామీ నిత్యానంద, బాల సాయిబాబా - ఒకరిని మించి ఒకరు, అమాయకులను దోచుకోవటానికి ఈ భూమి మీద ఉద్భవించారు. ఈ మధ్య వస్తున్న ప్రతి తెలుగు సినిమాకి ఏదో ఒక అర్ధం పర్ధం లేని ఉప శీర్షిక (శేషు - ది బుస్స్; జీనియస్ -ఒట్టి దద్దమ్మ) లాగా అమ్మా భగవాన్ - కల్కి అవతారం ; పత్రీజీ - శ్వాస మీద ధ్యాస; నిత్యానంద - రాసలీల మొ|| ఆకర్షనీయమైన నినాదాలతో వీళ్ళు అమాయకులని వంచన చేస్తున్నారు. పాపం ప్రసార మాధ్యమాల వాళ్ళు కూడా మొదటి రెండు రోజులు ప్రసారం చేసిన దృశ్యాన్నే మళ్ళీ మళ్ళీ చేసి మాటర్ సెటిల్ అయిన తర్వాత వదిలేస్తారు. ఉదాహరణకి అమ్మా భగవాన్ దారుణాల గురించి మాదక ద్రవ్యాల గురించి పుంఖాను పుంఖాలుగా కధనాలు ప్రసారం చేసిన మాధ్యమాలు ఒక్క సారిగా ఏమయిందో ప్రసారాన్ని ఆపి వేసి ఆ సంగతి పట్టించుకోవడం మానివేసాయి. పోలీసులు కూడా ష్ గప్ చుప్ అన్నారు. అమ్మ భగవాన్ ఈ సారి జాగర్త పడి, గుట్టు చప్పుడు కాకుండా తమ కార్యక్రమాలు నిరాటంకంగా సాగిస్తున్నాయి. బాల సాయి బాబా గాడి గారడీ విద్యలు చూడాలి - నోట్లోనుండి నిజాలు తప్పితే అన్నీ బయటకు కక్కుతాడు.
 
పత్రీజీ విషయం కూడా అంతే! ధ్యానానికి 200 ఎకరాలు ఎందుకండీ, భూమి లేని వాళ్లకు ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దలు ఏడ్చి చస్తారు గాని వీడికి భగావాను గాడికి మాత్రం దోచి పెడతారు.
 
ఈ బాబాలన్దరిని స్పెషల్ డ్రైవ్ పెట్టి కేసులు నమోదు చేసి రౌడీ షీట్ తెరవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

1 కామెంట్‌ :