21, జనవరి 2013, సోమవారం

వాయలార్ రవి చెప్పింది యిదే

 
రాయలసీమ సింహం (బిరుదు ఎవరు ఇచ్చారో తెలీదు) టి జి వెంకటేష్ ప్రభ్రుతులు వాయలార్ రవిని ఇటీవల కలిసినప్పుడు, కేవలం తెలంగాణాలోనే ఉద్యమం జరుగుతోంది కదా అని సెలవిచ్చారట. అంటే దాని అర్ధం తెలంగాణా విభజిస్తున్నాము అనికాదు వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే, మీరు ఊరికే ఎందుకు కూర్చున్నారు అని. దాని పర్యవసానమే సమైక్యాంద్రలో రాజుకున్న అగ్గి.    పరుగు పందెంలో పదిమంది పాల్గొంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారో చెప్పవచ్చు.    అలా కాకుండా, కేవలం ఒక జట్టు మాత్రమె పరుగు పందెంలో పాల్గొని తీర్పు చెప్పమంటే కుదరదు కదా అదే వాయలార్ రవి గారి మాటల అంతరార్ధం.   
 
 
కాబట్టి, ఇరు  ప్రాంతాల   తెలుగు  వాళ్ళు  పోటీలు  పడి  తిట్టుకొని,  కొట్టుకొని  బస్సులు తగలేసి, రైళ్ళు  ఆపి  ఎవరి శక్తి మేరకు  వారు  ప్రయత్నించి  రాష్ట్రాన్ని సర్వ నాశనం  చేస్తారని  ఆశిస్తున్నాం.         ఈ కార్యక్రమాలన్నిటినీ ప్రత్యక్ష ప్రసారాలకై  23తెలుగు చానళ్ళు 24 గంటలు సిద్ధంగా వున్నాయని 
తెలియచేయడానికి గర్విస్తున్నాం.  

2 కామెంట్‌లు :

  1. మాకెవ్వరికీ రాని ఆలోచన మీకు వచ్చింది. మీ పోష్టు సూపరో సూపరు. తెలుగువాళ్ళ అనైక్యత వర్థిల్లాలి.

    భాస్కర్

    రిప్లయితొలగించండి
  2. vardhillali.

    telabanula moorkhatwam vardhillali.

    రిప్లయితొలగించండి