23, జనవరి 2013, బుధవారం

కె వి పి అసలు సిసలైన కాంగ్రెస్ వాది


వాయలార్ రవి గారు చాలా స్పష్టంగా తీర సీమాన్ద్రులకు చెప్పారు - రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే జగన్ పార్టీ గెలుస్తుంది అదే తెలంగాణా ఇస్తే కనీసం 10 సీట్లు తెలంగాణా నుంచి వస్తాయి అని.    మన కె కె గారేమో మొత్తం 16 మనవే అని కామెడీ చేసారు.    చెన్నారెడ్డి గారి తెలంగాణా ప్రజా సమితి ఉద్యమం అప్పుడు పోలీసు ఫైరింగులోనే కొన్ని వందల మంది చచ్చిపోయారు, (ఫిగర్ కన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఆడిట్ కూడా చేసుకోవచ్చు) అయినా సరే ఆయనకు 10/14 మాత్రమె వచ్చాయి.  ఇప్పుడు మరీ 17 కి 17 మనవే అంటే అతిశయోక్తే కదా!

వాయలార్ రవి గారు మలయాళీ ఐనా ఆయన చెప్పినదానికి అచ్చ తెలుగులో అర్ధం ఏమిటంటే, ప్రత్యెక తెలంగాణ ఇస్తే,  ఆదుకోవడానికి తే రా స వుంది, అదే, మీరు చంచల్ గూడ వెళ్లి కాళ్ళు గడ్డాలు పట్టుకొని  జగన్ సారుని ఒప్పిస్తే, తే రా సా కి తూచ్ అంటాము ఎందుకంటే అక్కడ 25 సీట్లు వున్నవి కాబట్టి అని అర్ధం.     అన్ని విషయాలు అచ్చ తెలుగులో చెప్పరు, కొన్ని మలయాళంలోనో, మరాఠీలోనో, ఇటాలియన్ భాషలోనో  చెప్తారు, అర్ధం చేసుకోవాలి మరి. 

దీని పర్యవసానమే, అసలు సిసలైన కాంగ్రెస్ వాది కె వి పి గారి చొరవకు కారణం.     ఆయన తలచుకుంటే, స్వామీ కార్యం, స్వకార్యం రెండూ నెరవేరగాలవు.   

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి