26, జనవరి 2013, శనివారం

ఉండవల్లి గారి ఉపన్యాసం అంతరార్ధం ఏమిటి?

 
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి వక్త.   అవినీతి కంపు అంటని విలక్షణమైన  బహు కొద్ది మంది రాజకీయ నాయకులలో ఆయన ఒకరు.   
 
 
ఆయన ప్రసంగంలో చూపించిన క్లిప్పింగులలన్నీ ప్రజా బాహుళ్యంలో విస్తారంగా ఉన్నాయి.   అంతర్జాలం పుణ్యామా అని సంగణక యంత్రం(computer)తో పరిచయం ఉన్నవాళ్ళకి తెలిసినవే.   ఎవరికైతే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదో వారికి విషయాలు తెలుసుకొనే అవకాశం  కలిగింది. 

 
బ్రాహ్మణ కులంలోని ఉప శాఖ  గురించి  ఆయన  చెప్పింది  అక్షర సత్యం.     వాస్తవానికి "తెలఘాణ్య" బ్రాహ్మణులే తీర ఆంద్ర ప్రదేశ్లో ఎక్కువ శాతం వున్నారు.   ముఖ్యంగా వీరు ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో స్థిరపడినారు.   వీరంతా,  కొన్ని   దశాబ్దాల   క్రితం   తెలంగాణా నుంచి   వలస వచ్చిన వాళ్ళే.   వీళ్ళ ఇళ్ళ పేర్లన్నీ   తెలంగాణా ఊర్లపేరుతొఉంటాయి.    

 
ఆయన ప్రసంగం మొత్తం తె రా స ని, అది చేస్తున్న దౌర్జన్యాన్ని  తప్పుపట్టేడే  కానీ, అదే మాటలు వల్లెవేసే కాంగ్రెస్ వాళ్ళని ఏమీ అన  లేదు.   ఉండవల్లి గారిపై అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉంది.   ఆయనని దూషించడం ద్వారా, పొన్నం, మందా, యాష్కీలు కాంగ్రెస్ కి దూరమయ్యే అవకాశం వుంది.     ప్రస్తుతం తెలంగాణలో తె  రా  స, తక్కిన ఆంద్ర ప్రదేశ్లో వై ఎస్ ఆర్ సి పి గాలి విస్తృతంగా వుంది.    తెలంగాణా ఇస్తే తె  రా సా కలుస్తుందో లేదో కానీ, దానిని ఆపడం ద్వారా, కేసులు ఎత్తివేయడం లేదా బలహీన పరచడం ద్వారా, జగన్ పార్టీ కాంగ్రెస్ కి  దగ్గర అవడం ఖాయం.  జగన్ ద్వారా కనీసం ఒకటో ఆరో సీటు తెలంగాణలో కూడా తెచ్చుకోవచ్చు కానీ, తే రా స తో కలవడం ద్వారా వున్నవి ఊడే  ప్రమాదం వుంది.      ఇవన్నీ కాంగ్రెస్కి తెలిసే, కాంగ్రెస్ నాయకులను (కనీసం తీర ఆంధ్రలో) ఒకే త్రాటి మీదకు తెచ్చే బల ప్రదర్సన జరిగింది.   దీనికి కాంగ్రెస్ పెద్దల సహకారం తప్పకుండా ఉండే ఉంటుంది.    అందుకే, ఆయన ప్రసంగంలో ఎక్కడ కూడా బాబు గారిని, తెలంగాణా కాంగ్రెస్ నాయకులని, జగన్ పార్టీని తప్పు పట్టలేదు.   ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలో భాగం మాత్రమె. 

 
ఈ బహిరంగ సమావేశం ద్వారా, కాంగ్రెస్ మస్తిష్కంలోని ఆలోచన తేటతెల్లమవ్తుతుంది .    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  విభజనని 2014 ఎన్నికల దాకా  పొడిగించి, అప్పుడు సమైక్యమే మా విధానం అని ప్రకటించి, తే దే పా ని తీర ఆంద్ర ప్రాంతంలో దెబ్బతీసి MP సీట్లు కాంగ్రెస్కి, MLA సీట్లు జగన్కి వదిలివేయచ్చు.    తెలంగాణలో, తే దే పా వోట్ల చీలిక వల్ల  తే రా స కు కొంత నష్టం జరగినా ఆశ్చర్యపోనవసరం లేదు.     తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తే రా స లో చేరి వారి వారి శాసన సభా క్షేత్రాలలో సీట్లు డిమాండ్ చేస్తే, తే రా స నే నమ్ముకున్న నాయకులకు నష్టం జరిగి కొంత అసంతృప్తి ఏర్పడా వచ్చు.   కానీ తీర ఆంధ్రలో వున్న శాసన సభ్యుల్లో 90 శాతం మంది జగన్ గ్రూప్కి చెందినా వారే, కలహం ఉండక పోవచ్చు.  

 
తెలంగాణా విషయంలో ఇటు కాంగ్రెస్ కానీ, అటు తే ర స కానీ, పోరాడేది సీట్ల కోసమే, ప్రజల కోసం ఎంత మాత్రం కాదు.  సోనియా గాంధీ/కాంగ్రెస్ తెలంగాణాకి మద్దతు (గతంలో) ఇచ్చింది నిజం, బాబు గారు మాట మార్చింది నిజం, క చ రా గారు విద్వేషాలు రేచ్చాకోట్టింది నిజం, భాజపా రెండు నాలుకలు ఆరు కాళ్ళ నైజం నిజం, రాష్ట్ర విభజన వల్ల  ఉద్యోగాలు రావన్నది నిజం.    ఇదొక రాజకీయ క్రీడ, ఇప్పటి దాకా మనం చూసిన బూతులు, దౌర్జన్యాలు ఇంకొక సంవత్సరం భరించక తప్పదు.    

5 కామెంట్‌లు :

  1. అమ్మ తిట్టింది! వీరు ఏడ్చారు!! అంతే!!!

    రిప్లయితొలగించండి
  2. "ఇదొక రాజకీయ క్రీడ, ఇప్పటి దాకా మనం చూసిన బూతులు, దౌర్జన్యాలు ఇంకొక సంవత్సరం భరించక తప్పదు."
    తెలంగాణ ఇవ్వడానికి ఇంకా సంవత్స్రం పడుతుందా? 28న ఇవ్వరా? ఎక్కడోళ్ళు అక్కడే సమరదీక్ష చేస్తాం.

    రిప్లయితొలగించండి
  3. my 40 yeas experience as a common person in the society staying hyderabad and whole life struggled for a happy life and my slogan is leave andlet leave.
    Whatever may be the reason for the existing society development should be in all places i.e. i want to say we all (including politicians ,industrialist etc should help to develop and give lovelywood for a human whereever we leave) so that everybody can get lovelywood in life where ever he putsup. So that people will not look for a new place and it give chance for overall development of the locations villages country as a whole. thankg

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "leave andlet leave"

      Why should any one leave and to where? What if you are hounded whereever you go? How long can you run?

      Do you mean, live and let live?

      తొలగించండి
  4. దౌర్జన్యం జరిగిందా ? ఎక్కడ ?

    రిప్లయితొలగించండి