15, జనవరి 2013, మంగళవారం

సంకేతాలు, సంబురాలు, సమరాలు


ఈ మధ్య రాష్ట్రంలో "సంకేతాలు" బలంగా వస్తున్నాయి.   బహుశా  టవర్లు ఎక్కువగా వుండడం వలాననే కావచ్చు.   మొన్నటికి మొన్న కేవలం క చ రా గారి చరవాణికి మాత్రమె సంకేతాలు వచ్చాయి.   నిన్న మాత్రం సాక్షి దిన పత్రికకు మాత్రమె సంకేతాలు వచ్చాయి.     ఆ సంకేతాలనే వారు పతాక ఈర్శికలో ప్రకటించారు.     పెద్ద పెద్ద బూస్టర్లు పెట్టుకొని, కేవలం సంకేతాల కోసమే ఎదురు చూసే నమస్తే తెలంగాణాకు కూడా ఈ సంకేతాలు అందలేదు, కానీ సాక్షికి మాత్రమె అందాయి.  ఈ సంకేతాల సారాంశం ఏమిటంటే, త్వరలోనే రాష్ట్రం విడిపోతుంది, ఒక దశాబ్ద కాలం పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని.    
 
ప్రత్యేకించి సాక్షికి వచ్చిన సంకేతాలవల్ల నాకు రెండు విషయాలు బోధ పడుతున్నాయి -
 
అ) సమైక్య వాడుల్లారా, మీరు చాడీ చప్పుడు లేకుండా వున్నారు, జరగా కూడనిది జరగవచ్చు కొంచం మెలకువగా  ఉండండి అని, 
 
ఆ)ఇప్పటి దాకా గోడ మీద పిల్లుల్లాగా వున్న కాంగ్రెస్, తే దే పా MLA/MP 
ల్లారా తొందరగా చంచల్ గూడ వెళ్లి  ఆశీర్వాదం తీసుకోండి అనే ఒక సంకేతం.
 
ఈ శీర్షికకు కేవలం దానం నాగేంద్ర,ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవని
పాల్వాయి,మలయాళం మాతృభాషగా కలిగిన ఆమోస్  లాంటి వారు మాత్రమె
స్పందించారు,   లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.



 

2 కామెంట్‌లు :