20, డిసెంబర్ 2012, గురువారం

బ్లేడ్ బాబ్జీ రానాయణ - ఒక ఫాక్షన్ జీరో కధ

హెచ్చరిక : ఢిల్లీ విజ్ఞాన్ భవన్ పరిసర ప్రాంతాలలో షుమారు 60 సంవత్సరాల యువకుడు బ్లేడ్ ఝుళిపిస్తూ రెండు నాలుకలు వున్న వాళ్లకి ఒక నాలుక కోసి కాకులకు గద్దలకు (కోళ్ళకు మాత్రం కాదు) వేస్తునట్లుగా సమాచారం. కాబట్టి నగర పౌరులు అలాంటి అనుమానస్పద వ్యక్తీ కనిపిస్తే వెంటనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాము.
 
ఆనవాళ్ళు: ఎప్పుడు ఎర్ర చొక్కా వేసుకొని ఉంటాడు. నోరు అదుపులో వుండదు. యమ ధర్మరాజు చేతిలో గద, యమ పాశం లాగా ఈయన చేతిలో బ్లేడ్, ఉరితాడు ఎప్పుడు వుంటుంది. ఎక్కువగా చికెన్ దుకాణాల దగ్గర మాటు వేసే అవకాశం వుంది.
 
విశాలాంధ్ర (పేరు చూసి మోసపోకండి అది వాస్తవానికి విభాజనాంధ్ర ) దిన పత్రిక వారన్నా రానాయణ పేరు, ఫోటో వేస్తారో లేదో కానీ మిగిలిన అన్ని దిన పత్రికలలో ఈయన గారి పేరు, ఫోటో ఒక సంచలనాత్మక టైటిల్ ప్రతి నిత్యం తప్పని సరి. అసలే ధిల్లీ చలికి ఒకటికి రెండు రజాయిలు కప్పుకున్నా తట్టుకోలేక అక్కడి స్థానికులే చస్తుంటే, మన కామ్రేడ్ మాత్రం బ్లేడ్ పట్టుకొని ధిల్లీ వీధుల్లో స్వైర విహారం చేస్తా అంటున్నాడు. డబ్బులు కట్టనోడు ముందుగానే పడవెక్కి దర్జాగా కూర్చుంటాడు అనేది నానుడి. ఒక మండల ప్రెసిడెంటుగా కూడా సొంతంగా గెలవడానికి దిక్కులేదు కానీ, బ్లేడ్ పట్టుకొని అఖిల పక్షానికి వెళ్లి నాలుకలు కోసేస్తాడట. ఎప్పుడూ తిన్నగా మాట్లాడాడు. అన్ని తింగర మాటలే.
పాపం ఈయన పాపులారిటీ తెలియని తెలంగాణా వాళ్ళు "విభజనకు సై అన్న రానాయణ, తీర సీమంద్రాలలో తిరుగుతున్నా అక్కడి వాళ్ళు అడ్డుకోరు" కాబట్టి అక్కడి ప్రజలందరూ విభజనకి సై అంటారు అని సంబర పడి పోతారు. అసలు ఈయనకి సొంత మండలంలోనే అంత సీన్ లేదు, తగుదునమ్మా అని మొత్తం రాష్ట్రాని కే అంట కడతారు. తీర సీమాన్ధ్రలో ఇలాంటి కాయితం పులి ఇంకొకటుంది, ఆయనను కూడా ఎవరు పట్టించుకోరు. కేవలం మైకుల ముందు లుంగీ కట్టుకొని నిలబడి ప్రాస నియమాలు మాత్రమె పాటిస్తాడు, అసలు సరుకు తక్కువ. అక్కడ చెల్లని వాళ్ళందరూ తెలంగాణలో హీరోలైపోయారు విచిత్రంగా! మన రానాయణ ఆంధ్రుల నా అభిమాన "హాస్య"  నటుడు, ఆంజనేయస్వామి భక్తుడు ఐన నక్సలైటు రానాయణ మూర్తి కలిసి తిన్నగా రోడ్డు వెంట అమీరుపేటలో పగలు పూట నడిచినా ఎవరు పట్టించుకోరు, ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు ?కాకపొతే, ఎప్పుడూ పత్రికలలో బొమ్మల పెట్టలో కనపడాలనే ఒక తుత్తి!

7 కామెంట్‌లు :

  1. అవును, తీర సీమాంధ్ర ప్రాంతాల్లో నారాయణలను, నారాయన మూర్తులనూ ఎవరూ పట్టించుకోరు. వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు మింగలేదు, ఏకులానికీ కొమ్ము కాయలేదు, పార్టీ పెట్టిన మొదటిసారే టికెట్లు అమ్ముకోలేదు, లిక్కరు మాఫియాలు జేయలేదుగా మై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకొక విషయం కూడా దానికి చేర్చండి..షిప్పింగు వ్యాపారాలు చేసారు, ఊళ్ళొవాళ్ళ పిల్లలని ఆత్మ హత్యలకు పురికొల్పారు, రంగు నీళ్ళు పోసుకొని అగ్గిపెట్ట కోసం వెదికారు. చందాలు దౌర్జన్యంగా పోగుచేసి ధనవంతులయ్యారు....

      ప్రస్తుతం జరుగుతున్నది 3 కులాల ఆధిపత్య సమరం. ఆ వాస్తవం త్వరలో మీకు తెలుస్తుంది, అందరూ అందరే, కొంచం ఓపికపడదాం.

      తొలగించండి
    2. ఎవరు? నారాయణ, నారాయణ మూర్తులా? మీకామెంటు ఎంత అసందర్భంగా ఉందో తెలియడంలేదా? తెలంగాణలో ఈనారాయణలకు సీనిస్తున్నారని అన్నది మీరు, మరి వీరేమీ లక్ష కోట్లు మింగలేదు.

      మరోమాట షిప్పింగు వ్యాపారం జెయ్యడం నేరంకాదు, దానికి అక్రమ కాంట్రాక్టులు, భూములు ప్రబుత్వం అండతో పొందడం నేరం, అదెవరు జేసారో తెలుసుగా? ఆత్మహత్యలకు మాదగ్గర ఎవరూ ఉసిగొలపలేదు, ఆత్మహత్యలను అరికట్టడానికి ఊరూరా తిరిగి జనంలో చైతన్యం తీసుకొచ్చారు. వాల్ల సూసైడ్ నోట్లు తీసి చదవండి, ఎవరి మోసం వలన ఆత్మహత్యలు జేసుకున్నరో. సీమాంధ్రలో కొందరు శవాలమీద పెంకాసులు ఏరుకుంటూ ఓదార్పులు జేస్తున్నరు..ఎవ్వరూ చావకపోయినా చచ్చినట్లు నాటకాలాడుతున్నరు, జెర జూసుకోన్రి.

      అవును, ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతుంది మూడు కులాల ఆధిపత్య పైత్యం. వైకాప రెడ్డి, కాంగ్రేస్ కాపు, తెదేపా కమ్మ.

      తొలగించండి
    3. షిప్పింగు వ్యాపారం చేయడం, దానికి డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పకపోవడం, అవి డిక్లేర్ చేయకపోవడం, దొంగపాస్పోర్ట్లతో దుబాయ్‌కి మనుషులని పంపించటం, ఇడ్లీలు తిని దొంగదీక్షలు చేయడం, ఆంధ్రభవన్‌లో ఓ వయసుమీరిన ఓ ఉద్యోగిని కెమరాలేసుకెళ్ళి కొట్టడం, సీమాంధ్రోళ్ళు భాగో అనడం, ఆత్మహత్యలు చేసుకోండి ఇంటికో కలెక్టర్ ఉద్యోగం, 400గజాల స్థలం, ఓ మంత్రిపదవి ఇప్పిస్తాం అనడం నేరమెట్లవుతుంది? ఖచ్చితంగా కాదు.

      తొలగించండి
  2. మీకు షిప్పులు వ్యాపారం చేస్తున్నాయన దెవుడైతే కావచ్చు కానీ, నాకు మాత్రం లక్ష కోట్లు తిన్నవారు, టిక్కెట్లు అమ్ముకున్న వాళ్ళు మాత్రం గురువులు కారు. నా బ్లాగులో చాలా సందర్భాలలో వాళ్ళ మీద వ్యాఖ్యలు వున్నై. దయ చేసి చూడండి. మీరు చెప్పే 3 పార్టీలకు మీ దేవుడి పార్టీకి ఏమి తేడా లేదు. విదిపోదామని మీ దెవుడి మనసులో వుంటె, పరిష్కారం చాలా సులభం. ఈ గొడవలు ఉన్నంత కాలం మీరు చెప్పే 3 పార్టీలకు నెను చెప్పే మీ దేవుడికి చేతి నిండా పనే. ఇంక స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాకు షిప్పు వ్యాపారం జేసుకునేటోడయినా, ఎర్రచొక్కా నారాయణలైనా ఎవ్వరైనా ఒక్కటే. జై తెలంగాణ అంటే జై కొడుతం, నై తెలంగాణ అంటే తన్ని తరిమేస్తం. మీలెక్క రాజకీయ నాయకులను దేవుళ్ళలెక్కన జూసుకోవడం, కులాల లెక్కన వోట్లు గుద్దుకోవడం, ఓదార్పులు జేయించుకోవడం మాకు తెల్వదు. రాసింది నారాయణలమీద, దానిమీద సమాధానం జెప్పడం చేతకాక షిప్పులోడి మీదికెందుకు డైవర్షను?

      నాకు షిప్పులోడు దేవుడు గాదు, మీకు మూడు పార్టీలోళ్ళు దేవుళ్ళు కాదు. మీరు రాసింది నారాయణలు తెలంగాణోళ్ళకు హీరోలని, నేను జెప్పింది లక్షకోట్లు, వేలకోట్లు మింగేటోళ్ళు వెన్నుపోటు పొడిసేటోళ్ళు సీమాంధ్రోళ్ళకు హీరోలని.

      షిప్పులోడు కోట్లు మింగితె ఒక్క సీమాంధ్ర పత్రిక దానిగురించి సాక్షాలు చూపియ్యదెందుకు? వెన్నుపోటుగాడి మోసాలు పచ్చపత్రిక, ఓడార్పుదారుని లక్షకోట్లు ఇంకోపత్రిక రోజూ రాస్తయి గద? అధికారం ఏళ్ళతరబ్డి దగ్గర బెట్టుకుని లక్షలకోట్లు మెక్కి ఇప్పుడు జైళ్ళల్ల ఉన్నోళ్ళు గుడ కేవలం ఆర్నెల్లు మంత్రిగ ఉన్నోడిమీద ఏడుస్తె సిగ్గుపోద్ది.

      తొలగించండి
    2. నై తే లంగాన మీద అఖిలపక్షం వేశాం. ఈ కమిటీ కాకుంటే మరో పది కమిటీలు, కమిషన్లు వేసైనా ఏకాభిప్రాయం సాధిస్తాం. అంతవరకూ తెలంగాణ దిశగా మడమ తిప్పం. అంతవరకూ
      నై తెలంగాన
      నై నై తెలంగాన.

      తొలగించండి