23, నవంబర్ 2012, శుక్రవారం

కేకే తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు

తా చెడ్డ కోతి వనమెల్లా చెడిపిందట !! ఆయనే ఇంతవరకు ఏ ప్రత్యక్ష ఎన్నికలలో కూడా కనీసం వార్డు సభ్యునిగా కూడా ఎన్నిక కాలేదు, ఇప్పుడేమో ఎవరిదారి వారు చూసుకున్దామనుకుంటున్న కొద్దిమంది తెలంగాణా పార్లమెంటు సభ్యులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు. 
     

ఏ రాజకీయ నాయకుడైనా తన భవిషత్తు గురించి తోలి ప్రాధాన్యం ఇస్తాడు కాని పార్టీ గురించి ప్రజల గురించి ఆలోచించడు. పాపం మందా గారు, గుత్తా గారు అంతకు మునుపు తే దే పా తరఫున పార్లమెంట్ సభ్యులు. వారికి తెలుసు, 2009లో కాంగ్రెస్ మాత్రమె గెలుస్తుందని. తక్షణం జంప్ కొట్టారు. ఇప్పుడు అంతో ఇంతో గెలుపు అవకాశాలు వున్న పార్టీలు తెలంగాణలో రెండే రెండు. కాని కేకే గారి ప్రకారం వీరంతా తె రా సా లో మాత్రమె చేరాలి. లేదంటే ఉద్యమ కారులు వీళ్ళని వదలరు . 
    
ఇవ్వాళ కాకపొతే రేపైనా వై.కా.పా కొంగ్రేస్స్లో కలవాల్సిన పార్టీ. కాబట్టి అందులో చేరితే అంతో ఇంతో పార్లమెంటు సభ్యులకు లాభం కాని, తే రా సా లో లాభం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేటు కంపెనీ లాంటిది. ప్రైవేటు కంపనీలో ఎ ఉద్యోగి ఐనా మేము ఉద్యోగం వదిలేస్తాం అంటే, వద్దులే బాబు, వేరే కంపనీలో నీకు ఎంత వస్తుందో చెప్పు అంతా మేమే ఇస్తాం అంటారు. కాదు కూడదు అంటే, ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తినిఇంకొంచం ఎక్కువ ఇచ్చి స్వగృహ ప్రవేశం జరిపించి "పునరాగమనాయచ" ని మంత్రం చెప్తారు. అలాగే, చిదంబరం మొదలుకొని, అంటోని , ప్రణబ్ ముఖేర్జి, శరద్ పవార్ వరకు ఎంతో మంది సొంత కుంపట్లు వెలిగించి అవి సరిగ్గా మండక సగంలో ఆపేసిన వాళ్ళే .   మళ్ళీ కాంగ్రేస్స్లో కలిసినవారే. వారంతా ఇప్పుడు మంచి మంచి పదవులు అనుభవిస్తున్నారా లేదా? తెలివంటే అది. 
 
కాబట్టి,తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ లు చక్కగా వై పాలో చేరిపోయి మళ్ళీ ఎన్నుకోబడి మంత్రులవడం మంచిది. నా ఉచిత సలహా తప్పక పాటిస్తారని భావిస్తూ...

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి