28, జనవరి 2013, సోమవారం

రాష్ట్రాల వేర్పాటుపై ఉండవల్లి ఉటంకించిన అద్వాని గారి మాటలివే


ఉత్తర భారతంలోని మూడు రాష్ట్రాలు క్రొత్తగా వేర్పాటు చేసినపుడు, అప్పటి గృహశాఖామాత్యులు  అద్వాని గారిని పార్లమెంటులో విదర్భ వేర్పాటు గురించి అడిగిన ప్రశ్నకు  ఆయన ఇచ్చిన సమాధానం చూడండి --  

THE MINISTER OF HOME AFFAIRS (SHRI L.K. ADVANI)replying to the Debate, said: In 1953-54 a States Reorganization Commission was constituted and the Indian States were reorganized on linguistic basis. It will be in the fitness of things if another States Reorganization Commission is constituted today. There have been different demands from different States as well as from different regions. The people of Vidarbha raised a particular demand which is opposed by the people of rest of Maharashtra. We have taken the line that we can accede to a demand raised from a particular region only if due weight age is given to it by passing a resolutions to that effect in the State Legislative Assembly. It does not mean that we will concede everything passed by the State Assembly but with regard to the creation of a State the Assembly resolution signifies a general consensus.
 
"రాష్ట్రాల పునర్విభాజనాకై "రాష్ట్రాల పునర్విభజన కమిటీ వేయడం సమంజసం. చాలా ప్రాంతాల నుంచి ప్రత్యెక రాష్ట్రాలు కావాలని కోరికలు ఉన్నాయి. విదర్భ ప్రజలు అడిగిన ప్రత్యెక విదర్భ రాష్ట్రం విషయంలో మిగిలిన మహారాష్ట్రీయులు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యెక రాష్ట్రాల వేర్పాటు విషయంలో, రాష్ట్ర శాసన సభ తీర్మానం జరిగితే వాటి విషయంలో పరిశీలించడం జరుగుతుంది. దీని అర్ధం, ఆ రాష్ట్ర శాసన సభ చేసిన తీర్మానాన్ని మాత్రమె పరిగణిస్తామని కాదు"
 
ఇదీ అద్వానీ గారు కేంద్ర గృహ శాఖామాత్యులుగా ఉన్నపుడు పార్లమెంటులో గౌరవ సభ్యుడికి ఇచ్చిన సమాధానం. అంటే, శాసన సభలో తీర్మానం చేయడం తప్పనిసరి.(దానిని ఆమోదించినా ఆమోదించక పోయినా) ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రస్తుతమున్న పరిస్తితులలో అది సాధ్యమా?
 
 
పెద్దలు అద్వాని గారు, విదర్భ విషయంలో, తతిమా మహారాష్ట్ర ఒప్పుకోవడంలేదు కాబట్టి వేర్పాటు చెయ్యలేం అని శెలవిచ్చారు, కాంగ్రెస్ నాయకులు చెబుతున్న "కాన్సెన్సస్" అంటే అర్ధం అదే కదా! కాకపొతే, ప్రస్తుతం అద్వానీ గారు అధికారంలో లేరు అంతే  తేడా.
 
ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొన్న రాజమండ్రి సభలో ప్రజలకు చెప్తూ, మమ్మల్ని దొంగలు, దోపిడీదారులు అని నోటికోచ్చినట్లూ మాట్లాడుతూ, తీర్మానానికి సహకరించమట్లే కుదరదు కదా అన్నారు.
 
ఈ విషయం తెలంగాణాలోని అన్ని రాజకీయ పక్షాలకు, నాయకులకు తెలుసు, కానీ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.        

2 కామెంట్‌లు :

  1. కచరా కుటుంబాన్ని, బిజెపి రెండునాలుకల సిద్ధాంతాన్ని దృశ్యమాలికలో ఎండగట్టాడు. అందుకే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు.

    రిప్లయితొలగించండి