25, జనవరి 2013, శుక్రవారం

జర్నలిజం నైతిక విలువలు

జర్నలిస్టుల నైతిక ప్రవర్తన - నియమావళిని అనుసరించి సంపాదకునికి ఎవరైనా పాఠకుడు ఉత్తరం వ్రాసినపుడు దానిని యదా తధంగా ప్రచురించడం, దౌర్జన్యాలను ఘనకార్యాలుగా చిత్రించడం, రెచ్చగొట్టే శీర్షికలను ప్రచురించడం అనైతికం. అలాగే ప్రజల్లో భయాందోళనలు కలిగించే వార్తలను, ముఖ్యంగా అవి వాస్తవం కానప్పుడు, ప్రచురించరాదు.

 
 
మరి ముఖ్యంగా, తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఇచ్చే పత్రికా ప్రకటనల ప్రచురణలో (according to 1992 PCI guidelines) సంపాదకుడు సెన్సార్ చేయవలసిన అవసరం వుంది.

 
 
ఈ రోజు నమస్తే తెలంగాణ లో చూడండి - నిషేదిత నక్సల్ నాయకుడు జగన్ గారి రిపబ్లిక్ దినోత్సవ బహిష్కరణ ప్రకటన చూడండి. ఒక నమస్తే తెలంగాణా పత్రికలలోనే కాదు జ్యోతిలో కూడా ఇలాంటి ప్రకటనలు వస్తుంటాయి. యాష్కీ గారు లగడపాటిని గుడ్డలిప్పి తన్నాలన్నాడు - ఇది ఒక వార్తా? ఒక అతున్నత దేశ పార్లమెంటు సభ్యుడైన వ్యక్తీ మాట్లాడిన అభ్యంతరకరమైన భాషను యధాతధంగా ప్రచురించి, సమాజానికి మంచి చేస్తున్నామా? ఇంకొక వ్యక్తీ - సీమాన్ద్రులన్దరినీ తెలంగాణా నుంచి వెళ్ళకొట్టాలి అన్న వార్త ప్రచురించారు. ఇలాంటి వార్తలు ప్రచురించడం ద్వారా తప్పు చేసిన వ్యక్తి పరపతి పెంచినట్లు కాదా? గతంలో పయ్యావుల ప్రకటన "సుయిసైడు బాంబు" ప్రచురించడం కూడా ఇదే కోవకు చెందుతుంది.
 
 


జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి కోసం ఈ క్రింది లింకును నొక్కండి.
http://www.pressacademy.ap.gov.in/Journalistula_naitika_pravarthanaa_niyamavali.pdf

1 కామెంట్‌ :