17, జనవరి 2013, గురువారం

మూడు ముక్కలాట కన్నా 4 ముక్కలాట మంచిది

 
బాబు, నేను చెప్పదలచుకుంది పేకాట గురించి ఎంతమాత్రం కాదు.    రాష్ట్ర గీతం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర అది, రాష్ట్ర ఇది లాగే, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆట ఏది అని అడిగితె, పాపం నిజంగా చదువుకొనే విద్యార్ధులు  తిక మక పడకుండా పూర్తి క్లారిటీ  కోసం  రాస్తున్నాను.    
 
 
ఎంచక్కా తెలంగాణాని రెండు రాష్ట్రాలు (అంటే వరంగల్లో, కరీం నగరో రాజధానిగా తెలంగాణా  రాష్ట్రం ఒకటి, మరొకటి హైదరాబాద్ రాజధానిగా చుట్టు  పక్కల వున్న మహబూబ్ నగర్, రంగ రెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని  కొన్ని మండలాలు తీసుకొని మరొక రాష్ట్రం) తీర సీమంద్రని  ఆంధ్రాగా, రాయల సీమగా రెండు ప్రత్యేక రాజధానులతోటి రెండు రాష్ట్రాలు చేస్తే మన సమస్యకు పరిష్కారం దొరకచ్చు.     
 
 
హైదరాబాదు ప్రత్యేక  రాష్ట్రం విషయంలో తెలంగాణా వారికి కూడా ఎలాంటి అభ్యంతరం వుండకూడదు.    ఎందుకంటే, క చ రా గారి లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల మంది మాత్రమె హైదరాబాద్ల ఆంద్రోళ్ళు వలస వచ్చి వుంటారు.   అంటే దాదాపు 2.0 నుంచి  2.2 కోట్ల (ఊహాజనిత) హైదరాబాద్ రాష్ట్రంలో కేవలం 4 శాతం మంది మాత్రమె ఆంద్రోళ్ళు కదా?   ఈ విషయంలో తెలంగాణా వాది  వెంకయ్య నాయుడు గారికి కూడా అభ్యంతరం వుండదు. ఎందుకంటే, హిందీ మాట్లాడే వాళ్లకి డజను రాష్ట్రాలు ఉండగా తెలుగు మాట్లాడే వాళ్లకి 4 రాష్ట్రాలు ఉంటె తప్పేంటి, అధికస్య అధికం  ఫలం అన్నారు కదా పెద్దలు.   దీనివలన తెలంగాణా నాయకత్వానికి స్వయం పాలనతో పాటు, కేవలం 4-5 లక్షల మంది ఆంధ్రా వలస వాదులపై పెత్తనం చెలాయించే అవకాశం కూడా దొరుకుతుంది.

16 కామెంట్‌లు :

  1. మేకు ఇంకోటి తెల్వదు.తెలంగాణా కంటె ముందర కోస్తా ఆంద్ర ని రెండు గా
    అంటే రెండు రాష్ట్రాలు గా రాయలసీమ ను ఒక రాష్ట్రంగా,అదిలాబాదు ఖమ్మం
    రాజమండ్రి లో ని కొంత భాగం కలుపుతూ బద్రాచలం రాజధానిగా గిరిజన రాష్ట్రామ్.కరీంనగర్ రాజధానిగా ఒకటి.హైదరాబాదు రాజధానిగా ఇవ్యాలి
    మొత్తం ఆరు రాష్ట్రాలు గా ఇవ్యాలి.గ్రామానికి ఒక మంత్రి కంత్రి వుండాలి

    రిప్లయితొలగించండి
  2. ఆప్పుడు నా STD బిల్లు వాచిపోతుంది . ఎవరి గోల వారిది

    రిప్లయితొలగించండి
  3. తప్పకుండా మంచిదే కానీ అదేదో హైదరాబాదు ప్రజలు అడగనివ్వండి. నడిమిట్ల బయటొల్లకు ఎందుకు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాష్ట్రాన్ని విదదీయాల్సిందే. ఒక మలయాళీ ఐన ఆమొస్కు, హర్యాన మనిషి సుష్మాకు సంబంధం వున్నప్పుడు తెలుగు వాడిని నాకు ఎందుకు వుండకూడదు.

      జగ్గారెడ్డి, దానం, ముఖేష్, మజ్లిస్ వీళ్ళంతా తెలంగానా వాళ్ళే కదా?

      తొలగించండి
    2. అమోస్ గారు మలయాళీ అవునో కాదో తెలీదు కానీ ఖచ్చితంగా కేరళ వారు మాత్రం కాదు. ఆయన కేరళకు వెళ్లి సొల్లు మాట్లాడితే అక్కిడి వాళ్ళు చెప్పుచ్చుకోరా?

      మజ్లిస్ వాళ్ళు హైదరాబాదు రాష్ట్రం కావాలన్నారా? నేను వినలేదు లెండి.

      తొలగించండి
    3. MIM ఒప్పుకునే వరకూ తెలంగాణ స్టేట్ డిమాండ్ కొయ్యగుర్రం సవారే, కాంగ్రెస్ ఒక్క ఇంచ్ కదపదు. కావాలంటే రాహుల్ చీకేసిన లాలిపాప్ పేకేజి ఇస్తారు, దానికి ఎగబడతారు, ఎదురు చూడాలి.

      తొలగించండి
    4. ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, కూకట్పల్లి, బంజారా, జూబ్లి హిల్స్, దిల్సుఖ్నగర్ హైదరాబాద్ ప్రజలు సమైక్యాంధ్రకు సుముఖంగానే వున్నారు. ఎటొచ్చీ నడిమిట్ల కరీంనగర్, నిజామాబాద్నుంచి వలసవచ్చిన OU హవ్‌లాయ్ గార్లదే లొల్లి.

      తొలగించండి
    5. @అజ్ఞాత: ఔనా మరి డిసెంబరు 10-23 మధ్య ఒక్కడు లొల్లి పెట్టలేదేంది హైదరాబాదుల?

      @kachadarajakeeyam.blogspot.in

      తెలంగాణా వాళ్ళు ఒక మెట్టు దిగడానికి సిద్ధమే. రెండేళ్ళు పాటు తాత్కాలిక (ఉమ్మడి కాదు) రాజధాని ఉంటె అభ్యంతరం లేదన్నారు కదా. మదరాసు కట్టుబట్టలతో వదిలిన దానికన్నా ఇదే నయం.

      తొలగించండి
    6. @జై

      డిసెంబరులో ఎవడు లొల్లి చెయ్యలేదు కదా.....

      తె దే పా వారు తె రా సతొ కలిసినపుడు తెలుగు తమ్ముళ్ళు మాట్లాడలేదు. అది తప్పు. కేవలం బాబు అధికారం కోసం వేసిన ఎత్తుగడ.

      క చ రా గారు జోనల్ వ్యవస్త రద్దు చెయ్యమన్నారు, సమైక్యం ప్రాతిపదికగా ఏర్పడ్డ తె దే పాతో కలిసి పదవులు అనుభవించినప్పుడు కనపడని దోపిడి తరువాత మాత్రమే కనిపించింది. అది కూడా స్వార్ధమే.

      ఉత్తర ప్రదేష్ చాలా పెద్ద రాష్త్రం, దానిని మాత్రం విడగొట్టకూడదు (అసెంబ్లీ అనుకూల తీర్మానం తరువాత కూడా) కానీ కేవలం ఆంధ్ర ప్రదెష్ని మాత్రమె విడగొట్టాలనే మత మౌఢ్య భా జ పాది తప్పు.

      తిలా పాపం తలా పిడికెడు...

      @ జై గారు,

      మీరు నిస్వార్ధంగా ఉదారంగా 2 సంవత్సరాల గడువు ఇచ్చారు. పైగా మెట్టు దిగామంటున్నారు, ఆత్మ విమర్శ చేసుకోండి, సమస్య పరిష్కారం కాక పోవచ్చు.

      ఏం తెలుగు మాట్లాదే వాళ్ళకి 4 రాష్త్రాలుంటే తప్పేంటి? రాయలసీమ వాళ్ళు కూదా ప్రత్యేకం అంటున్నారు కాబట్టి, 1) హైద్రాబాద్ రాష్ట్రం (ఇందులో కూడా 96% తెలంగాణా ప్రజలే కదా), 2) తెలంగాణా రాష్ట్రం 3) రాయల సీమ (రాజధాని రాయలసీమలొ వుండాలి) 4)ఆంధ్ర రాష్త్రం (దీని రాజధాని కేవలం కోస్తాలోనే వుండాలి).

      ఈ ఏర్పాటు వల్ల అటు మజ్లిస్, ఇటు సీమ, తీర ప్రాంత ప్రజలు తక్షణం ఒప్పుకొనే అవకాశం వుంది. హైదెరాబాద్ గురించి ఇంత కొట్లాటకు కారణం కొంత మంది తె రా స మూర్ఖులు. జిల్లాల మధ్య రొడ్లపై గోడలు కట్టించి, భాగొ జాగొ అని బెదిరించి ఈ స్థితికి తీసుకొని వచ్చారు. తీరాంధ్రలొ ఆ నియొజకవర్గం ప్రజలకు కూడా పూర్తిగా తెలియని లగడపాటి, మేకపాటి, తోకపాటిలను హీరోలను చేసింది తె ర స వాళ్ళే. లేదంటే 3 రాష్ట్రాలతో సరిపొయెది. ఏది ఏమైనా రాష్ట్రాల విభజన జరగాలి 'షిండే'.

      అలాకాదు, హైదరాబాదు నుంచి వెళ్ళల్సిందే అంటే, జనవరి 28 తరువాత వచ్చేది 29 మాత్రమే.

      తొలగించండి
    7. మానసికంగా పాతాళంలో వున్న వాళ్ళు ఒక్క మెట్టు దిగినా, 100మెట్లు ఎక్కినా ఒహటే. తెలంగాణ రాష్ట్రం కావాలంటే రాజధానిని ఆత్మవిశ్వాసంతో వదులుకోవడం లాంటి త్యాగాలు చేయాలి. దానికి దమ్ములేకుంటే చచ్చినట్టు పడివుండాలి.

      తొలగించండి
  4. జై గారు, వాళ్ళడిగిన రాయల తెలంగాణ కంటె, హైదరాబాద్ మంచిదే గదా?? సమస్య పరిష్కరించాలంటే అందరూ ఒక మెట్టు దిగాలి కదా, లేదంటె, ఈ రావణ కాష్టం కాలుతునే వుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, కూకట్పల్లి, బంజారా, జూబ్లి హిల్స్, దిల్సుఖ్నగర్ హైదరాబాద్ ప్రజలు సమైక్యాంధ్రకు సుముఖంగానే వున్నారు. ఎటొచ్చీ నడిమిట్ల కరీంనగర్, నిజామాబాద్నుంచి వలసవచ్చిన OU హవ్‌లాయ్గార్లదే లొల్లి.

      తొలగించండి
  5. @ అఙాత గారు, జై గొట్టి గారి గురించి, నా గురించి వ్రాసిన అసభ్య కరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యానం తొలగించాను. దయచేసి అలా నా బ్లాగులో రాయొద్దు.

    ఆయన "చెప్పుచ్చుకొని కొడతారు" అని నన్ను ఉద్దేసించారని మీరు తెగ బాధ పడిపోయారు. చదువిన/ప్రచురించిన నాకు లేని బాధ మీకెందుకు? అతని బ్లాగు చూడండి. మంచి ఆంగ్ల పద ప్రయోగాలతో బాగా వ్రాస్తారు. ఉన్నత చదువులు చదువుకొన్నప్పటికీ, ఒక్కొకసారి, వయసు వల్ల వచ్చే వుద్రేకంలో చిన్న చిన్న తప్పులు దొర్లచ్చు. నేను గతంలో అలానే చేసి తర్వాత నొచ్చుకున్న సందర్భాలు వున్నాయి. నాకు, ఆయనకు వ్యక్తిగతంగా ఏమి వైరం లేదు. నేను అతని వ్యాఖ్యలు ప్రచురిస్తూనే వుంటాను (దూషణలు లేనంతవరకు). దయ చేసి నాకు ప్రాంతాలను అంటగట్టవద్దు. నేను విభజనకు మద్దతు ఇస్తాను అది నా వ్యక్తిగతం. మీరు నాకు పాఠం చెప్పనవసరం లేదు.





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీలో మీరే ఏదో వూహించుకుని డైలాగులు చెప్పేస్తున్నారు. నాకైతే పైన ఏ అజ్ఞాత వ్యాఖ్యలు అగుపించడం లేదు.
      ఆయన ఆంగ్ల పదాలు ప్రయోగించే షేక్స్పియర్ అయితేకావచ్చు, సంకుచిత భావదారిద్ర్యం మాటేమిటి? ఆంగ్లపదాలు టాకింగ్ డిక్ష్నరీ కూడా చెబుతుంది. కావాలంటే ఆయనతో మీరు ట్యూషన్ చెప్పించుకోండి.

      తొలగించండి
    2. అఙాత అనె పేరుతో ఎవరైనా రాయొచ్చు కదా. మీరు రాసారని చెప్పలేదు. ఆయన వ్యాఖ్యలు నేను తొలగించాను, మీకు కనపదవు కదండీ!

      రాష్ట్రాన్ని విడదీయాల్సిందే. తె రా స చేసిన విష ప్రచారం వలన, దాడుల వలన మాత్రమే రాజధాని విషయంలో పీతముడి పడింది. కాబట్టే, 4 రాష్ట్రాలను చేయడం ద్వారా పరిష్కరించవచ్చు.

      తొలగించండి
  6. ఇంగ్లీషులో మంచి పదాలు వస్తే షేక్స్పియర్‌లా నాటకాలు రాసుకోవాలి, కీట్స్, వర్డ్స్‌వర్త్ లా కవితలు రాయాలి. బ్లాగుల్లో తప్పుడు, విష ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం కచడారాజకీయం గారు? పోనీ ఆయన బ్లాగుల్లో వుచితంగా ఇంగ్లీషు ట్యూషన్ చెబుతాడేమో కనుక్కోండి, మా పిల్లల్ని తోలుతా. అంతేగాని కాళోజీ కల్లుతాగి రాసుకున్న "IPC మారుతుందా? ఆకాశం పడుతుందా? " లాంటి కపితల్ని ఆయనలా ముచ్చటించుకుని, ఆస్వాదించడం, ఆయన ఎంత ఇంగ్లీషు వర్డ్స్‌వర్త్ అయినా కుదరదు.

    రిప్లయితొలగించండి