4, డిసెంబర్ 2012, మంగళవారం

స్వయంకృతాపరాధం

రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొన్ని నెలలకు కే కే గారు తిరుపతి వెళ్ళారు. విలేకరులు సదరు కే కే గారిని జగన్ గురించి అడిగారు. జగనా, ఎవరాయన, ఓ రాజశేఖర్ కొడుకా! అని అసలు జగన్ మోహన్ రెడ్డి గురించి తెలియనట్లు మాట్లాడాడు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ నాయకులు, మరి ముఖ్యంగా తెలంగాణా సీనియర్లు అని పిలిపించుకోబడే వి హెచ్ గారు, పాల్వాయి గారు, శంకర్ రావు గారు ఒంటి కాలు మీద లేచారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఏమిటి. అదేదో పాట గుర్తొస్తుంది .. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. కాంగ్రెస్స్ పరిస్తితి ఎంత దయనీయంగా వుందంటే, ఒకప్పుడు వర్కింగ్ కమిటీలో సభ్యులైన వారే కాంగ్రెస్స్ పార్లమెంటు సభ్యులకు తె రా స కు మధ్యవర్తిత్వం నడుపుతున్నారు.

ప్రతిరోజూ విలేకరుల సమావేశం పెట్టేది ముఖ్యమంత్రిని తిట్టేది. పాపం కాంగ్రెస్స్ వారు అధికారంలో వుంటే ప్రతిపక్షానికి అసలు పనే వుండదు. రాను రాను ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువై ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్స్ పరిస్తితి తమిళ్ నాడు స్థాయికి దిగాజారినా పెద్ద ఆశ్చర్యం లేదు.
 

కొసమెరుపేందంటే , కాంగ్రెస్స్ పార్టీలో నాయకత్వాన్ని బండ బూతులు తిట్టి బయటకు వచ్చి మళ్ళీ గెలిచి లోపలినుంచో బయటనుంచో కాంగ్రెస్స్కు మద్దతుయిచ్చి వున్నత స్థానాల్లో వున్నవాళ్ళు బోలెడు మంది వున్నారు అదే జరిగితే, మరి ఈ కే కే లు, కా కా ల పని గోవిందా. అందుకే అంటారు, రాజకీయాలలో పూర్తి కాలపు మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి