2, జులై 2013, మంగళవారం

రాయల సీమకు, తెలంగాణాకు భావ సారూప్యత వుంది


విజయ నగర సామ్రాజ్య పతనం తరువాత కర్నూల్, కడప, అనంతపురం మరియు చిత్తూర్ ప్రాంతాలు నిజాం నవాబుల పాలనలోనే ఉన్నాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం.   తదనంతరం వచ్చిన బ్రిటీష్ పాలకులకు,  కప్పం కట్ట లేని నిజాం ప్రభువు సీడెడ్ జిల్లాలుగా (సీడెడ్ అంటే ఒక చట్టబద్ధమైన ఒడంబడిక) ఆ నాలుగు ప్రాంతాలను ప్రకటించి బ్రిటిష్ వారికి (దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు) ధారాదత్తం చేశారు.     కాబట్టి కర్నూల్ మరియు అనంతపురం వాసులకు కూడా హైదరాబాద్ బిర్యానీ రుచి తెలుసు.    బిర్యానీ రుచి తెలియడం,  క చ రా గారి సిద్ధాంతాల  ప్రకారం ఒక కనీస అర్హత, కాబట్టి రాయల తెలంగాణాకు వారు ఒప్పుకొని తీరాల్సిందే.   


సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత కర్నూల్ లోని కొన్ని  ప్రాంతాలు మహబూబ్ నగర్ జిల్లాలో చేరాయి.   వీటిల్లో ముఖ్యంగా తుంగభద్రా పరీవాహక  ప్రాంతాలు ఎక్కువ.    కర్నూల్ నుంచి ప్రస్తుత రాజధాని కేవలం 210 కి మీ మాత్రమే.   ఆ రకంగా చూసినా, ఆదిలాబాద్ వారికన్నా కర్నూల్ వారికే హైదరాబాద్ సమీపం.   ఆంద్ర రాష్ట్ర రాజధానిని కోల్పోయి, హుందాగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా  ఒప్పుకున్న కర్నూల్ ప్రాంతీయులకు హైదరాబాదుపై సర్వ హక్కులు వుంటాయి.    

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి