12, జులై 2013, శుక్రవారం

ఉత్తరాఖండ్ మృతుల్ని "ఆధార్" ద్వారా ఎందుకు గుర్తించలేదు ?


అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ కార్డుల నమోదు దాదాపు తుది దశకు చేరుకుంది.    ఆధార్ కార్డులు కేవలం చౌక ధరల దుకాణాల వస్తువుల కోసమో, చిరునామా గుర్తింపు కోసమో లేక గ్యాస్ సబ్సిడీ కోసమే కాదు నేర పరిశోధనలో, గుర్తింపబడని శవాల విషయంలో కూడా ఈ సమాచారం అత్యంత కీలకం.    


మొన్న ఉత్తరాఖండ్ బీభత్సంలో మృతిచెందిన వారిని కేవలం డి ఎన్ ఎ నమూనాలు మాత్రమే తీసుకున్నారు.   మ్రుతులలో కనీసం 50 శాతం మంది ఆధార్ కార్డులు నమోదు చేసుకున్న వారు వుండి ఉండవచ్చు.   వారి వేలి ముద్రను లేదా కంటి పాపను (ఐరిస్) బయోమెట్రిక్ యంత్ర సహాయంతో కంప్యుటర్లో నమోదు చేస్తే, కార్డు వున్న వారి చిరునామా దొరికేది కదా!    నేను నెట్ లో చూశాను, చేతివేళ్లు నలిగిపోయినా, ప్రమాదవశాత్తు శరీరం నుండి వేరు చేయబడినా కూడా వేలి ముద్రను తీసుకోవచ్చు.     మరి ప్రభుత్వం ఎందుకు చెయ్యలేదు చెప్మా! 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి