11, జులై 2013, గురువారం

రాష్ట్ర విభజనపై రేపు ఏ నిర్ణయం వెలువడదు


అరచేతిలో తేనె పోసి, మోచేత్తో నాకించడం అంటే ఇదే.    12 వ తేదీ డెడ్ లైన్ అని, టి డే అని, కౌంట్ డౌన్ మొదలైందని  ఊదర గొడుతూ ప్రసార సాధనాలన్నీ మంచి ఊపును తెచ్చాయి.    


సున్నితమైన తెలంగాణా లాంటి అంశాల మీద ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, తగిన పోలీసు బందోబస్తు, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో  ముళ్ళ కంచెలు,  లారీల నిండా ప్రత్యెక పోలీసులు, లేదా విజయవాడ, వైజాగ్ అనంతపురం లాంటి ప్రాంతాలలో ప్రత్యెక బలగాలు, వారం ముందు నుండే జరిగే ప్రహసనం.    ఇంతవరకు ఇలాంటివేమీ జరిగినట్లు దాఖలాలు లేవు.   కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రేపటికి రేపు రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచుతాము లేదా రెండు మూడు  ముక్కలు చేస్తాము అని ప్రకటన చేయక పొవచ్చు. 


గతంలో దూరదర్శన్ జాతీయ చానల్లో, వారం వారం జస్పాల్ భట్టి గారి నాటకం వచ్చేది.    ఒక నాటికలో జస్పాల్ భట్టి, తన కార్యాలయంలో ఎలుకల తాకిడీ బాగా ఎక్కువగా వుందని, వాటిని నిర్మూలించడానికి వేయవలసిన పధక రచనకు ముఖ్యులతో బోర్డు రూములో సమావేశం ఏర్పాటు చేస్తాడు.    గంటల తరబడి చర్చించిన అనంతరం, బయట వేచివున్న  ఒక పెద్ద మనిషి, భట్టి గారిని అడుగుతాడు - ఏం సార్, ఏమి నిర్ణయించారని - ఆహ్ ఏముంది, వచ్చే మీటింగు ఎప్పుడు పెట్టుకుందామని తారీకు నిర్ణయించుకున్నాము అని సమాధానం వస్తుంది.      


గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదీ ఇదే! 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి