1984 ఎన్నికలలో దాదాపు దేశంలోనే మొట్టమొదట వెల్లడించిన ఫలితం హనంకొండ పార్లమెంటు స్థానం. గెలిచిన చందుపట్ల జంగా రెడ్డి స్వర్గీయ పి వి నరసింహా రావు పై విజయం సాధించారు. ఈ స్థానం కాకుండా భాజపా మరో అభ్యర్ధి పటేల్ అహ్మదాబాద్ నుంచి గెలుపొందారు. అప్పట్లో రేడియోలు తప్ప టి వి లు పెద్దగా అందుబాటులో లేని రొజులు. ఎంత సేపు రేడియో విన్నా, ఈ ఇద్దరు తప్ప భాజపా తరఫున మూడో అభ్యర్దే గెలవ లేదు. కుటుంబ నియంత్రణ లాగా ఇద్దరితో ఆగిపోయింది.
2004లో దాదాపు 15 పార్టీలు వున్న ఎన్ డి ఎ కూటమి, మంచం కోళ్ళ లెక్కలాగా కేవలం శివసేన, అకాలీ దళ్ అనే రెండు పార్టీల మద్దతుకు పడిపోయింది. అలాగే, ఆ పార్టీలో అంతకుముందు వరకు రెండవ స్థానంలో వున్న అద్వానీ గారిని పక్కకు పెట్టడమే కాదు, ఆయన ఇంటిపై మోడీ వర్గం వారు రాళ్ళు వేసేవరకు వచ్చారు.
ఇవన్నీ చూస్తుంటే, భాజపాకు సంఖ్యా శాస్త్రం ప్రకారం రెండు అనే సంఖ్య అంతగా అచ్చొచినట్లు కనపడడం లేదు.
కామెంట్లు లేవు :
కామెంట్ను పోస్ట్ చేయండి