31, మే 2013, శుక్రవారం

"తెలంగాణా ఉష్ణోగ్రతలను దోచుకుంటున్న ఆంధ్రోళ్లు"


జల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ, భూముల దోపిడీ, బొగ్గు దోపిడీ, నిధుల దోపిడీ, సున్నపు రాయి  దోపిడీ వగైరా వగైరా గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూనే వున్నాం.    నిన్ననే, ఒక వార్తా పత్రికలో ప్రొఫెసర్ కోదండ రెడ్డి గారి పత్రికా ప్రకటన చూసి విస్తుపోయాను.   ఆ ప్రకటన సారంశం ఏమిటంటే, తెలంగాణలో నమోదవుతున్న ఉష్నోగ్రతల వివరాలను  ఆంధ్రా పాలకులు కొన్ని డిగ్రీలు తక్కువగా నమోదు చేస్తూ, తెలంగాణాకు అన్యాయం చేస్తున్నారని.    ఈ విషయమై మేధావి వర్గంతో చర్చించి మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేస్తామని ఆయన శెలవిచ్చారు.   


మేధావిగా తనను తాను  భావించుకొనే కోదండం గారు ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్ర ఉద్య'మమ్' గురించిన ప్రణాళికలు మానేసి, ఆంధ్రోల్ల ఉష్ణోగ్రత దోపిడీ గురించి వార్తల్లో నలుగుతున్నారు, తధాస్తు!

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి