31, మే 2013, శుక్రవారం

హత్య, మానభంగం కేసులో జీవిత ఖైదు పడ్డ భాజపా ఎం ఎల్ ఎ భర్త


శాస్త్రం చెప్పే బల్లి కుడితి తొట్లో పడటం అంటే ఇదే - మధ్య ప్రదేశ్ కు చెందిన ప్రస్తుత భాజపా శాసన సభ్యురాలు ఆశారాణి గారి భర్త,  ఒకప్పటి శాసన సభ సభ్యుడు అయిన అశోక్ వీర్ విక్రం సింగ్ గారికి స్థానిక న్యాయస్థానం యావజ్జీవిత కారాగార శిక్ష విధించింది.   


2009 వ సంవత్సరంలో 21 సంవత్సరాలు వయసున్న  తన మనవరాలి వరసైన యువతిని  బలవంతంగా   లొంగ దీసుకోవడంతో ఇతగాడి పతనం ప్రారంభం అయింది.    కొంతకాలంగా మనోవేదనను అనుభవిస్తున్న ఆ యువతి, సింగ్ తనపై చేస్తున్న అత్యాచారాన్ని ఆపకపోతే ఈ విషయాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో, సదరు విక్రం సింగ్ ఆ యువతిని హత్య చేసి భోపాల్కు సమీపంలో పారేశాడు.   గతంలో జరిగిన బూటాసింగ్ బంధువు హత్యకేసలో ఆరోపణలు ఎదుర్కొని రుజువులు లేని కారణంగా విడుదల కాబడ్డ "రాజు భయ్యా"    ఎట్టకేలకు  పోలీసులు సరైన సాక్షాధారాలు న్యాయస్థానం ముందుంచడంతో ఈ కేసులో  యావజ్జీవ కారాగార శిక్ష పడింది.     


మనవరాలిని బలాత్కారం చేసి హత్య చేసిన ఘన చరిత్ర కలిగిన ఈ బుందేల్ ఖండ్ రాజా వారు కాంగ్రెస్ నుంచి భాజపా వరకు అన్ని పార్టీలలో పనిచేసాడు.     సాటి స్త్రీ అని కూడా  చూడకుండా పని మనిషిని హింసించి  ఆమె ఆత్మ హత్యకు కారణమై కేసులు ఎదుర్కుంటున్న  ఆయన భార్యను  ఎం ఎల్ ఎ ను చేసి భారతీయ జనతా పార్టీ  వీర విక్రం సింగ్ గారి మర్యాదను కాపాడింది.  


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి