31, మే 2013, శుక్రవారం

ఎంపీ రాజయ్య మిడిల్ డ్రాప్ !


సహస్రావధాని డా॥ గరికిపాటి గారి కావ్యం సాగర ఘోష కావ్యంలో చెప్పినట్లు "తల్లి మాటను కాదని పిన తల్లి దయకు నేడ్వ, రెంటికిని చెడ్డ రేవడైతిన్" అని ఒక పద్యం వుంది.    పాపం మన వరంగల్ ఎం పీ రాజయ్య గారికి ఈ పద్యం బాగా నప్పుతుంది.    శ్రీహరి సర్వాంతర్యామి, ఇందుగలదండులేడని సందేహము వలదు .....   కడియం శ్రీహరి తే రా స లో చేరిక తే దే పా కు మాత్రమె కాదు, రాజయ్య గారికి  కూడా దెబ్బ  తగిలింది.     కె సి ఆర్ మాట తప్పే మనిషి కాదు, శ్రీ హరి కి కన్ఫర్మ్ చేసిన వరంగల్ ఎం పీ  బెర్తు కాన్సిల్ చెయ్యలేడు.   ఇప్పటిదాకా కాంగ్రెస్ మనోబావలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఆయనకు 2014 లో సీటు వస్తుందో రాదో తెలీదు.    


ఎప్పటినుంచో తన జట్టులో వున్న తక్కిన ఇద్దరు ఎంపీలు కారెక్కి జాం జాం అని తిరగబోతుంటే తను మాత్రం కాడి కింద పడేశాడు.      ఆయనను వదులుకోవడం ఇష్టం లేని కె సి ఆర్, వరంగల్ జిల్లా నుంచి ఎం ఎల్ ఎ ను చేస్తాను కారేక్కమంటున్నాడు.  రాబోయే రోజుల్లో ఏమి చేస్తాడో చూడాలి మరి!



3 కామెంట్‌లు :