నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఆంద్ర ప్రదేశ్ జనాభా 8.46 కోట్లు కాగా అందులో హైదరాబాద్తో కూడిన తెలంగాణా ప్రాంత జనాభా 3.53 కోట్లు మాత్రమే. ప్రతి టి వి చర్చల్లో, ఉపన్యాసాల్లో ఇహ నుంచి విభజన కోరే మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పి మభ్య పెట్టడం సమంజసం. ఈ మూడున్నర కోటిలో పద్నాలుగు సంవత్సరాల లోపల వయసు వున్న పిల్లలు 25% శాతం మంది అంటే 88 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకు ఆ'కాంక్ష' రావడానికి ఇంకొక 5-10 సంవత్సరాలు పడుతుంది. అంటే, నికరంగా 2.65 కోట్ల మంది ఆకాంక్ష.
ఇందులో, తెలంగాణాను పూర్తిగా వ్యతిరేకించే ప్రజలు (అంటే బాన్స్వాడ ఎం ఎల్ ఎ పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పినట్లు - నాకు వోట్లేయ్యని సేటిలర్స్ పని పడతానని అన్నాడు చూడండి), సి పి ఎం, ఎం ఐ ఎం, జగ్గారెడ్డి లాంటి సమైక్యాంధ్ర మద్దతు దారులు , జంట నగరాలు వాటి చుట్టు పక్కల ప్రాంతాలు, విభజన జరిగితే మరో గుజరాత్ అవుతున్దనుకొనే ముస్లింలు, వ్యవసాయ రంగంలో వలస వచ్చి స్థిరపడిన రైతులు, జంట నగరాలలో దశాబ్దాల వెనుక స్థిరపడిన వారు, పైకి విభజన కోరుతూ (రాజకీయ మనుగడ కోసం) లోలోపాల సమైక్యంగా వుండాలనుకొనే వారు, కంచె ఐలయ్య లాంటి మేధావులు, భద్రాచలం డివిజన్, మునగాల పరగణా ప్రజలు,మహబూబ్ నగర్ జిల్లాలో చేరిన కర్నూల్ ప్రాంతాల గ్రామాలు, చందాదల దందాను మౌనంగా ఎదుర్కొంటున్న వారు, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని కోరుకొనే వారు, ----- ఇలాంటి వారి సంఖ్య కేవలం 25 నుంచి 30 శాతం వుందని అనుకుంటే, మిగిలేది కేవలం 2కోట్ల మంది.
చంద్ర బాబు నాయుడు చూపించే విక్టరీ గుర్తు (రెండు వేళ్ళు) కి అర్ధం బహుశా అదే కావచ్చు. కాబట్టి, ఇహ నుంచి ఏ చర్చలు జరిగినా రెండు కోట్ల మంది ఆ'కాంక్ష' అనడం సముచితం.
3.53 కోట్ల మిశ్రమ జనాభాలో 2 కోట్ల SONS OF THE SOIL తెలంగాణను కోరుకొంటున్నారంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వారెవరైనా మెజారిటీ అభిప్రయానికి తలవంచాల్సిందే కదా!
రిప్లయితొలగించండి