4, ఏప్రిల్ 2013, గురువారం

సంజయ్ దత్తుకు వత్తాసు పలుకుతున్న తారలు


మహారాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం సంజయ్ దత్తును అక్రమ ఆయుధాలు కలిగివున్న కేసులో  దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే, చిరంజీవి మొదలుకొని, బాలివుడ్డు తారల వరకు ఆయనకు క్షమా భిక్ష పెట్టాలని గొంతు చించు కున్నారు.      


మన దేశంలో అంతో ఇంతో నిక్కచ్చిగా వున్న వ్యవస్థ ఏదైనా వుందీ అంటే, అది కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.      సంజయ్ దత్ గొప్ప నటుడు, ఆయన తల్లి తండ్రులు కూడా గొప్ప నటులు, అంత మాత్రాన సంజయ్ దత్ చేసిన తప్పులు ఒప్పు కావు కదా!


బాంబు దాడి కేసులో ఉరి శిక్ష ఎదురుకుంటున్న ప్రొ ॥ భుల్లర్ కు క్షమా భిక్ష పెట్టాలని అకాలీ పార్టీలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు చెస్తున్నాయి.    మన దేశంపై దాడికి దిగిన కసాబ్,  నక్సల్ ముసుగులో వున్న పౌరహక్కుల సంఘాలకు పోరాట యోధుడుగా కనిపించాడు!  పార్లమెంటుపై దాడి కేసులో ఉరి తీయబడ్డ ఆఫ్జాల్ గురు మన పౌర హక్కుల నేతల దృష్టిలో మంచివాడు.     మన ప్రియతమ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి, పేదల పాలిట పెన్నిధి, అత్యంత నిజాయితీ పరుడైన రెడ్డి గారు, ఖూనీ కేసులో శిక్ష అనుభవిస్తున్న మఖ్బుల్ అనే ఉగ్రవాదిని సత్ప్రవర్తన కారణంగా 5 సంవత్సరాలకే వారిని వదిలేశారు.   ఇటీవల జరిగిన దిల్సుఖ్నగర్ పేలుళ్ళ వెనుక అతగాడి హస్తం వున్నట్లు NSA వారు అదుపులోకి తీసుకోవడం జరిగిన్ది.    అలానే, గౌరు చరిత గారి భర్తను కూడా సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం తగ్గించి వదిలేశారు.     ఫదుల సంఖ్యలో హత్యలు, దోపిడీలు చేసిన ఫూలన్ దేవిని దేశ అత్యున్నత  చట్ట సభకు పంపించిన ఘన చరిత్ర కలిగిన నేపధ్యం మన రాజకీయ పార్టీలకు వున్ది.  


న్యాయ స్థానాలు ఇచ్చే తీర్పులను అమలు పరచకపోవడం మొదటి తప్పు కాగా, తీర్పును తప్పు పట్టడం, శిక్షను  తగ్గించడం రెండవ తప్పు.       సంజయ్ దత్ తప్పు చేశాడని నమ్మిన న్యాయస్థానం అతనికి శిక్ష విధించింది, కాబట్టి అనుభవించాల్సిందే.      సత్ప్రవర్తన కారణంగా శిక్షను తగ్గించే అధికారం రాజకీయ నాయకులకు ఇవ్వకుండా చట్టంలో సరైన మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా వుంది .      
   

1 కామెంట్‌ :

  1. ముందు సంజయ్ దత్‌ను వెనుకేసుకొచ్చే చెత్తనాకొడుకులందర్నీ, వాళ్ళ స్టేట్‌మెంట్‌లను ప్రచురించే మీడియా బ్రోకర్‌గాళ్ళను తోలు వలిచెయ్యాలి. అప్పుడుగాని ఈనా కొడుకులకు బుద్దిరాదు

    రిప్లయితొలగించండి