9, ఏప్రిల్ 2013, మంగళవారం

"మేళ్ళ" తాలూకు చిక్కుల్లో చెల్లెమ్మ


దివంగత నేత, ప్రియతమ నాయకుడు, చేవెళ్ళ  చెల్లెమ్మగా భావించే మన రాష్ట్ర గృహ శాఖా మంత్రి గారు తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు.    పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టి, మేనల్లుడికి పరోక్షంగా "మేళ్ళు" చేయడం ద్వారా దేశ  అత్యున్నత దర్యాప్తు సంస్థ చేతికి చిక్కారు.  


ప్రియతమ నేత ఏ  శుభకార్యం తలపెట్టినా చేవెళ్ళ  నుంచే మొదలు పెట్టేవారు, కానీ ఈ ఆనవాయితీని కాదని సి బి ఐ వారు మాత్రం మోపిదేవితో మొదలు పెట్టి, వయా శ్రీకాకుళం,  చేవెళ్ళకు వచ్చారు.    ఆనవాయితీ ప్రకారం ప్రాసిక్యూషన్కు ముఖ్యమంత్రి గారు  అనుమతి ఇవ్వకపోయినా, రాజీనామాపై రాజీ పడ్డా, మన దేశంలోని న్యాయస్థానాలు చూస్తూ వూరుకొనే స్థితిలో మాత్రం లేవు.     


"దాల్ మియ్యా" ఇచ్చిన లంచాలు తాలూకు పాపం,  ఆ కంపనీ  యజమానిని వదిలేసి,   అందులో  పనిచేసే  అధికారుల ఖాతాలోకి వెయ్యడం మాత్రం గర్హనీయం.      ప్రైవేటు రంగ పరిశ్రమలో ఇలాంటి తప్పుడు  పనులన్నీ యజమానుల కనుసన్నలలో  మాత్రమె జరుగుతాయి.     కేవలం జీతం కోసం పనిచేసే ఉద్యోగులు వాళ్ళ యజమాని ధన దాహానికి మూల్యం చెల్లిస్తున్నారు.    


రాబోయే రోజుల్లో, ప్రియతమ నేత "మేళ్ళ" తాలూకు ఖాతాలో మరెంత మంది బలి కానున్నారో!

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి