రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షంపై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు లేదా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నప్పుడు హైకోర్టు/సుప్రీం కోర్టు నివ్రుత్త న్యాయమూర్తి చేత ఒక కమిషన్ ను ఏర్పాటు చెస్తాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఇలా ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు వాళ్లకు అనుకూలంగా లేకపోతే తిరస్కరించడం ఒక పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాలలో ఈ కమిటీలు కేవలం ప్రతిపక్షాలను తాత్కాలికంగా శాంతింపచేయడానికి లేదా కాలహరణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఆదర్శ్ పేరిట బొంబాయిలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకోసం కట్టిన అపార్టుమెంటులో కొంత మంది కేంద్ర మంత్రులు, స్వయానా రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రులు , కొంతమంది అధికార ప్రముఖులు కలిసి తలా కొన్ని ఫ్లాట్లు పంచుకున్నారు. దీనిపై నియమించిన కమీషన్ తన నివేదికలో వీళ్ళు చేసిన అక్రమాలను బట్టబయలు చేసింది. అలాగే, జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ గతంలో భాజపా శివసేన అరాచకాలపై ఇచ్చిన నివేదికను కూడా ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన సమస్యపై 85 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం పాటు అన్ని ప్రాంతాలు తిరిగి ఇచ్చిన సమగ్ర నివేదికను కనీసం పార్లమెంటులో ప్రవేశ పెట్ట లేదు. అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన న్యాయ నిర్ణేతలు నిగ్గుతేల్చిన అంశాలపై కనీసం చర్చించనప్పుడు జడ్జీల సమయం ఎందుకు వృధా చేస్తారు? నివేదికలోని అంశాలు తమకు అనుకూలంగా వుంటే ఒకరకంగాను లేకుంటే మరో రకంగాను వ్యవహరించడం సమంజసమేనా? ఈ విషయంలో అధికార మరియు ప్రతిపక్షాల వైఖరి ఒకేలా వుండటం మరీ విచిత్రం. కనీసం ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఇలాంటి నివేదికలకు తప్పకుండా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
1, జనవరి 2014, బుధవారం
విలువలేని ప్రభుత్వ కమిషన్లు
30, డిసెంబర్ 2013, సోమవారం
యడ్డీ పునారాగమనం కాంగ్రెస్కు తిరోగమనం
కర్ణాటక జనతా పార్టీ నాయకుడు, పూర్వ భాజపా ముఖ్యమంత్రి స్వగృహ ప్రవేశం ఖాయమైంది. జనవరి 15 తరువాత ఆయన తన పార్టీని భాజపా లో కలపనున్నారు. ఈ పరిణామం కాంగ్రెసుకే కాదు జనతా దళ్కు కూడా నష్టమే. భాజపాను మూడో స్థానానికి నెట్టివేసి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న దేవెగౌడ పార్టీ, యడ్యూరప్ప చేరికితో శాసన సభ సభ్యుల సంఖ్యను పెంచుకొని ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకోనుంది.
యద్యూరప్పను పార్టీ నుంచి గెంటి వేసే వరకు వెంటాడి వేధించిన అనంతకుమార్, సదానంద గౌడ, ఈశ్వరప్ప మొ॥ తమంత తాముగా పార్టీపై వత్తిడి పెంచి మరీ తమ నేతను వెనుకకు రప్పించుకోవడం ఆయన బలాన్ని తెలయచేస్తుంది. యడ్డీ ఒక మాస్ లీడర్. రాష్ట్ర జనాభాలో సుమారు 17% గా వున్న లింగాయత్ లకు ఈయనే పెద్ద దిక్కు. ఈయన మాట వారికి వేద వాక్కు. అలాంటి నేత భాజపాలో తిరిగి చేరడంతో కన్నడ నాట రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయనను ఎదుర్కోవాలంటే, కాంగ్రెస్-జనతాదళ్ ఏకం కాక తప్పదు. అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక పరిణామం అశనిపాతంలా దాపురించింది.
28, డిసెంబర్ 2013, శనివారం
చింత చచ్చినా పులుపు చావని మాల్య
(అ)విజయ్ మాల్యా గారు ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా అర్ధ నగ్న చిత్రాలు ముద్రించిన క్యాలెండర్లు విడుదల చేశారు. ఇది ఆయన గారి స్థాయికి ఒక చిహ్నం. ఇలా ముద్రించిన క్యాలెండర్లను కేవలం ఎంపిక చేయబడిన కొందరికి మాత్రమె ఆయన అందచేస్తారు.
మన దౌర్భాగమేందంటే, ఇదంతా పన్నులు కట్టే వాళ్ళ డబ్బు మాత్రమే. విపరీతమైన నష్టాలతో కింగ్ ఫిషర్ విమాన సంస్థ మూతపడ్డ తరువాత ఈయన మీద బాంకుల వాళ్ళు, సప్లైర్లు బోలెడు కేసులు పెట్టారు.బాంకులకే సుమారు 7000 కోట్లు అప్పులు తీర్చాలి. జాతీయ బాంకులు వీటిని నిరర్ధక ఆస్తుల కింద (NPA) తెల్చేసాయి. బాధితులలో వీళ్ళు కాక ఉద్యోగులు, సప్లయర్లు, విమానాశ్రయాల వాళ్ళు, పెట్రోల్ కంపెనీ వాళ్ళు, మిగిలిన సప్లయర్లు కూడా వున్నారు. కానీ ఆయన మాత్రం రంగు రంగుల సూటు బూటుతో దర్శనమిస్తున్నారు.
గ్రామాలలో పొలం తాకట్టు పెట్టుకొని బ్యాంకులు రైతులకు వ్యవసాయ ఋణం ఇస్తారు. పంట పండినా ఎండినా, తీసుకున్న అప్పును గడువులోపు తీర్చకపోతే పాత కాలంనాటి మహింద్రా రోప్లాస్ జీపులో గ్రామస్తులందరూ చూస్తుండగా తీసుకొని పోతారు. కానీ మన కధలో మల్లయ్య లాంటి బడా పారిశ్రామికవేత్తలు మనదేశంలో కోకొల్లలు. అలాంటి వాళ్ళను మాత్రం ఎవ్వరూ ఏమీ చెయ్యలెరు. దురదృష్టం, ఆయను గారు స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్య సభలో ఆరు సంవత్సరాల పాటు మనకోసం కష్ట పది పని చేసారు కూడా. అంతే కాదు, లండన్లో వేలం వేస్తున్న టిప్పు సుల్తాన్ గారి కత్తిని కొన్ని కోట్లు వెచ్చించి కొనుక్కొని తన ఇంట్లో అలంకరించు కున్నారు. ఈయన గారు ప్రభుత్వ బ్యాంకులకు కట్టాల్సిన ధనమంతా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కట్టే ఆదాయపు పన్ను డబ్బులే! పారిశ్రామిక వేత్తలకిచ్చే అప్పుల విషయంలో, వాటి వసూళ్ళ విషయంలో కఠినంగా వ్యవరించాల్సిన అవసరం వున్ది.
బ్రిటిష్ పార్లమెంట్ లో మన దేశం గురించి మెకాలే ప్రసంగ పాఠం
ఈ వార్త ప్రచురించింది 1835 వ సంవత్సరంలో. ఈ వార్తలోని ప్రధమ భాగం చదివి భారతీయులుగా మనం గర్వించాలి. విక్టోరియా మహా రాణి భారతీయులకు ఆంగ్లం నేర్పించవద్దని, వారు తమ భాషను సరిగా ప్రయోగించలేక ఉచ్ఛరించలేక అవమానపరుస్తారని మేకాలేకు చెప్పారట. కానీ ఈ మెకాలే అనేవాడు అధిష్టానానికి సలహాదారుడు (డిగ్గీ రాజాలాగా) భారతీయులకు ఆంగ్లం నేర్పించడం వలన వాళ్ళని బ్రిటీష్ పాలనలో గుమాస్తాలుగా చేసుకోవచ్చని తద్వారా మన సంస్కృతిని, సాహిత్యాన్ని దేబ్బతీయచ్చని వాడి సలహా. ప్రస్తుతం మనం వాళ్ళ పాలనలో లేకపోయినా, మెకాలే చేసిన నష్టం మాత్రం కొనసాగుతోంది.
25, డిసెంబర్ 2013, బుధవారం
24, డిసెంబర్ 2013, మంగళవారం
ఉన్నత న్యాయస్థానం వారి అత్యున్నత తీర్పు
పద్మశ్రీ బిరుదును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఉన్నత న్యాయస్థానం స్పందించిన తీర్పు హర్షణీయం. ఒక కులాన్ని అత్యంత నీచంగా చిత్రీకరించడం, హేళన చెయ్యడం ఇతగాడికి మొదటినుంచి వున్న అవలక్షణం. ఇటీవల విడుదలైన ఆయన తనయుడి చిత్రంలో బ్రాహ్మణులను హేళన చేస్తూ చిత్రీకరించిన సన్నివేశాలకు వ్యతిరేకంగా స్పందించిన వారిపై గుండాలతో దాడి చేయించిన సంస్కృతి ఇతగాడిది. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని ఫోనులో గుండాల చేత బెదిరించిన నైజం బహిరంగం. తానొక్కడే ఈ దేశంలో అత్యంత "డిసిప్లిండ్" అని గొప్పలు చెప్పుకొనే ఈయన గారి డిసిప్లిన్ గురించి చాలామందికి తెలుసు. షూటింగ్ లలో "డిసిప్లిన్" పేరిట హీరోయిన్లపై చేయ్యిచేసుకోవడం, ఈయన గారి నోటి దురుసుతనం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. తెలుగు సినిమా వజ్రోత్సవాలలో ఈయన ప్రవర్తించిన తీరు అందరికీ గుర్తు వుండే వుంటుంది. ఇలాంటి పోగరుబోతులకు, అలాంటి వారితో రాసుకు పూసుకు తిరిగే ఇంకో హాస్య నటుడికి న్యాయస్థానం తీర్పు చెంప పెట్టు. న్యాయస్థానం వారి తీర్పు ఈ రోజు ఉదయం 6 గంటలకు దినపత్రికలో చూసి చాలా సంతోషించాను. కొంతైనా అహంకారం తగ్గించుకొని శేష జీవితాన్ని గడుపుటాడని ఆశిస్తున్నా.
చేతికి చిక్కిన చీపురు
కేజ్రీవాల్ - నిన్నటి దాకా ఒక నిబద్ధతకు, నిష్కళంక పాలనకు కాబోయే ప్రతినిధిగా ఓటర్లు భావించారు. దిల్లీలో ఏకంగా 28 శాసన సభ్యులను గెలిపించుకొని సాంప్రదాయ పార్టీలకు చెమటలు పెట్టించింది. కానీ ఏమి లాభం, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకొని హస్తం చేతికి చిక్కింది. గంట సేపు ఒకరిని ఒకరు బూతులు తిట్టుకొనే రాజకీయ చర్చల్లో వచ్చే ఎస్ ఎం ఎస్ పోల్స్ లాగా ఈయన కూడా ఎస్ ఎం ఎస్ లు, ఈ మెయిల్స్ ద్వారా కాంగ్రెస్ మద్దతుకు అనుకూలంగా ఫలితాలు తీసుకున్నారు. అవినీతిని ఊడుస్తా, కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది, షీలా దీక్షిత్ ను ప్రాసిక్యూట్ చేస్తా అని నిన్నటి వరకు చిలక పలుకులు పలికిన ఈ సామాన్యుడి పార్టీ కాంగ్రెస్ వేసిన ఎత్తుకు చిత్తైంది. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తరువాత కానీ ఈయనకు తత్త్వం బోధ పడదు. మొదటినుంచి చాలా మందికి ఆమ్ ఆద్మీ పార్టీపై ఒక అనుమానం వుండేది - ఇది కాంగ్రెస్ పార్టీ కోవర్టేమో అని, బహుశా ఈ అనుమానం నిజం కావచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)

