8, మార్చి 2014, శనివారం

విజయ మాల్యా ఎక్కడో పోలీసులకు తెలియదట




వార్తల్లోని వ్యక్తీ, రాజ్యసభ సభ్యుడు, లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్య గారు పోలీసుకులకు గత సంవత్సరం నుండి కనపడలేదట.    ఆదాయపు పన్ను శాఖ వారు కోట్ల రూపాయల టి డి ఎస్ (Tax deducted at Source) పన్ను ఎగవేతకు కాను  ఆయన మీద  బెంగలూరులో ఆర్ధిక నేరాల  న్యాయస్థానంలో 2013 లో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.   గౌరవ న్యాయస్థానం వారు మాల్యాను హాజారు పరచాల్సిందిగా కబ్బన్ పార్క్ పోలీసులకు సమన్స్ పంపించింది.    2103 ఫిబ్రవరిలో జారీ అయిన సమన్స్ శాసన సభ ఎన్నికల ఒత్తిడి కారణంగా అందచేయలేక పోయామని పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది.    కోర్టు మళ్ళీ సమన్సు జారీ చేసింది.  కొంతకాలానికి పోలీసులు న్యాయస్థానానికి నివేదిక పంపుతూ తాము IPL క్రికెట్   ఆటల బందోబస్తుతో తలమునకలై ఉన్నామని అందుకే మాల్యాకు సమన్స్ అందజేయలేక పోయామని బాధ పడ్డారు.  


న్యాయమూర్తి గారికి కోపం వచ్చింది.   కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ నుండి కూత వేటు దూరంలో వున్న పంచ తార హోటలులో ఆయన గారు IPL వేలంలో పాల్గొన్నట్లు, IPL పోటీలు జరిగిన క్రీడా ప్రాంగణంలో మాల్య తాపీగా కూర్చిని తిలకించినట్లు వున్న వార్తా పత్రికల క్లిప్పింగులను పోలీసు వారికి ఇచ్చారు.    విధిలేక మరోసారి సమన్స్ జారీ చేసింది న్యాయస్థానం.  


ఈయన గారు మన గౌరవ పెద్దల సభలో పటిష్టమైన చట్టాలు చేసే సభ్యులు.   అందమైన అమ్మాయిలతో అసభ్యకరమైన కాలెండర్లు ముద్రించి ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పెద్ద మనుషులకు పంపిస్తుంటాడు.   ప్రభుత్వ రంగ బాంకుల నుంచి ఈయన గారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు  ఇప్పుడు నిరర్ధక ఆస్థులుగా మారాయి.  


రైతులు తీసుకున్న రుణాలు, గృహ రుణాలు, బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కట్టడంలో జాప్యమైతే, ప్రభుత్వ రంగ బాంకులు పత్రికలలో ప్రకటన యిచ్చి మరీ ఆస్తులను అమ్మేస్తారు.   కానీ మన చట్టం మల్యా లాంటి వారికి వర్తించదు.  

3 కామెంట్‌లు :

  1. మనపోలీసులు గుడ్డోళ్ళండి పెద్దోళ్ళ దగ్గర కొచ్చేతలికి

    రిప్లయితొలగించండి
  2. ముసలి మాల్య చేయి తగలగనే పడచు సమీరా రెడ్డి పరవశించి, పులకరించి పోతున్నాది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సొమ్ముబాబూ సొమ్ము, సొమ్ముతగిలితే అందరూ అంతే :)

      తొలగించండి