20, ఫిబ్రవరి 2014, గురువారం

అసలు క్విడ్ ప్రో కో అంటే ఇదే


మంగళవారం నుంచి నిరంతరాయంగా నడుస్తున్న ధారావాహికలో పెద్దమ్మ, చిన్నమ్మ, దద్దమ్మలు కలిసి  రాజ్యసభ అంకంతో  రక్తి  కట్టిస్తున్నారు. పెద్దమ్మ బిల్లు పెట్టింది, చిన్నమ్మ నోట్లో వేలేసుకొని తలాడించి  కాంగ్రెస్ ఎంపీల చేత కాళ్ళకు నమస్కారం పెట్టించుకుంది.   అంతా  అయిపోయిన తరువాత  మన మాట వంకర వెంకయ్య గారు సీమాన్ధ్రకు అన్యాయం జరగనివ్వం అనే పదాన్ని పది రూపాయల నోటు మీద ఎన్ని భాషలలో ముద్రించి వుంటుందో అన్ని భాషలలో మైకు ముందు చెప్పేస్తారు.   ఇహ నుంచి తెలంగాణా విమోచన ప్రదాత చిన్నమ్మ, సీమాన్ధ్ర కింగ్ మన వెంకయ్య. ఎన్నికలప్పుడు చిన్నమ్మ తెలంగాణలో ప్రచారం చేస్తారు, తీర సీమాన్ధ్రలో వెంకయ్య గారు జనాల్ని మభ్య పెడతారు.   వెంకయ్య గారు అంత్య ప్రాసలతో జనాల్ని ఓలలాడించినా ఆయనకు ఆంధ్ర నాయకులు అడ్డు చెప్పరు, కారణం ఆయన జనాభాలో ఐదు శాతం సామాజిక వర్గానికి ప్రతినిధి కాబట్టి.   


చిత్త సుద్ధి వుంటే, సుష్మా స్వరాజ్ లోక్ సభలో ఎందుకు బిల్లుకు సవరణలు పెట్టలేదు?  అంతా 23 నిమిషాలలో కానిచ్చి తెలంగాణా వారి ఓట్లను కొల్లగోడదామని కాదా?   ఇప్పుడు బిల్లును ఏదో విధంగా అడ్డుకున్నట్లు నటించి రాజ్యసభలో నాటకాన్ని రక్తి కట్టించి ఆంధ్రలో ఓట్లు దండుకుందామన్న దుర్బుద్ధి కాక మరేమిటి?   


ఇంతవరకూ వచ్చాక మళ్ళీ రాజ్యసభలో గొడవెందుకు.   అసలే బలహీన మనస్తత్వం వున్న ప్రజలున్న రాష్ట్రం మనది.   ఇప్పుడు బిల్లు ఆలస్యం అయితే, ఆత్మ హత్యలు జరగ వచ్చు.    లైట్లు ఆపేసి మేజువాణి పెట్టేస్తే సరి.  






3 కామెంట్‌లు :