8, జనవరి 2013, మంగళవారం

కల్వకుంట్ల తుపాకీ రాముడు (KTR)

 
రాను రాను బొత్తిగా భయం లేకుండా పోతున్నది మన క తా రా రాకి. మొన్నటికి మొన్న ఉద్యమం అన్నాడు, సరే చేసుకోవచ్చు తప్పులేదు. కానీ ACP స్థాయి అధికారిని నోటికి వచ్చినట్లు దూషించాడు. అది చాలదన్నట్లు ఇప్పుడేమో సమైక్య ఆంద్ర నాయకులే ఒవైసీ చేత ఈ దారుణం చేయిస్తున్నారు అంటాడు. ఈయన మాటలు అచ్చం  తుపాకి రాముడి మాటలు పోలివుంటాయి. మజ్లిస్, హిందువులకు వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమమైనా అది భా జ పా కు లాభం. (కావాలంటే కరీంనగర్ నుంచి కేంద్ర గృహ మంత్రి అయి ఆ తర్వాత టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చడానికి తోడ్పడిన పెద్ద మనిషిని అడుగు. వివరంగా చెప్తాడు). భా జ పా వాళ్ళు అసలే ఆంధ్రాలో తెలంగానం తప్ప వేరే విషయం లేక చస్తుంటే, ఈ అక్బర్ గాడు వాళ్ళ చేతికి ఆయుధం ఇచ్చాడు. భా జ పా తెలంగాణలో బలపడితే, తే రా సా నోట్లో మట్టే. ఎందుకంటే, మీ నాన్న ప్రజలను ఎప్పుడు ఎలా రేచ్చగొడతారో ఎప్పుడు హటాత్తుగా నీళ్ళు చల్లి ఫాం హౌస్లో తేనీరు సేవించి నిద్ర పోతారో తెలియదు. కొంత కాలానికి ప్రజలు భా జ పా ని మీకు ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం వుంది. మీరు బాధ పడాల్సింది భా జ పా తెలంగాణలో ఎదుగుదల గురించి కానీ మజ్లిస్ గురించి కాదు.


మొన్నటి దాకా కేంద్ర మంత్రికి ఉత్తరం ఇస్తే చాలు అని తే దే పా వెంట పడ్డారు. నష్టమో కష్టమో పాపం బాబు గారు ఆ ముచ్చట కాస్తా తీర్చిన తర్వాత, కనీసం ఒక్క సారైనా "జై తెలంగాణా" అని అనిపియ్యండి అని ఒకడంటే, ఇంకొకడు, బాబు గారు తెలంగాణా అని రాసి వున్నా "బోనం" ఎత్తుకోలేదంటాడు. వీటివల్ల తెలంగాణా వస్తుందా?ఆయన ఈ రెండు పనులూ చేస్తే సీమంధ్రలో వైసీపీ ఇంకాస్త బలపడుతుంది. జగన్ ఎంత బలపడితే, తే రా సాకి అంత నష్టం.
 
 
ఇదిగో తుపాకి రాముడూ, వచ్చే ఎన్నికల తర్వాత, భా జ పా వారు తే దే పాతో చేతులు కలపవచ్చు, మీరు, వై సి పి, ఎం ఐ ఎం వారు కాంగ్రెస్తో జత కలవ వచ్చు. ఎన్ని సంకరాలు జరుగుతాయో ఎన్ని కండువాలు మారుతాయో తొందర పడొద్దు.

 
ప్రతిదానికి సమైక్యాంద్ర బూచిని చూపించి ఎంతకాలం జనాన్ని మోసం చేస్తారు. ఇప్పటికైనా గెస్ట్ హౌస్ లలో రెస్టులు తగ్గించి, ఇరువర్గాల పెద్దలతో, మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కేవలం సమస్యాత్మక విషయాలైన, నీళ్ళు, రాజధాని, భాగో - జాగో, పేడ బిర్యానీ మొ|| విషయాలపై చర్చించి పరిష్కరించుకుంటే చరిత్రలో మిగిలిపోతారు. లక్ష్యం సాధించిన వారౌతారు.

4 కామెంట్‌లు :

  1. Sir,
    Owaisi is being hounded for hate speech he made in Adilabad. Similar offensive the speechs were given by KCR, Kodanda Ram, Harish Rao against Seemandhrites. Why should Owaisi be booked while these fellows are free?

    Owaisi Lawyers are going to make a strong defence on this point for which AP Police will be defenceless and all the cases will be dismissed/withdrawn by the Police.

    Similarly no custody was there for Raj Thakre on his hate speeches.

    రిప్లయితొలగించండి
  2. నెను మీ వ్యాఖ్యలో కొంతవరకు మాత్రమె ఏకీభవిస్తాను. ఒవైసీ చేసింది చాలా పెద్ద నేరం. అతను ఈ దేశ సార్వభౌమత్వాన్నే ప్రస్నించాదు.

    రాజ్ థాకరే, క చ రా, హరీష్ రావు, క తా రా రా, మొదుగుల, తె దె పా కెశవ్, తెలంగాణా నక్సల్ అనుబంధ సంస్థలు, టి జి వి, మొ|| కూడా అతిగానే ప్రతిస్పందించారు.

    ఒవైసీ కేసుతొ అంకురారోపణ జరిగింది. రక్షక భటులు ఇలాంటి విషయాలు ఇక తీవ్రంగా తీసుకుంటారని భావిద్దం.

    రిప్లయితొలగించండి
  3. Partiality of AP Police and government is exposed and will be exploited by criminal politicians.

    రిప్లయితొలగించండి