13, డిసెంబర్ 2012, గురువారం

హిందూ దేవుళ్ళ రూపాల దురుపయోగం

 
 మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినోడు కూడా అదే అంటాడు అనేది సామెత. అందులో ఆశ్చర్యం లేదు. విదేశీయులు చెప్పులపై, లోదుస్తులపై హిందూ దేవుళ్ళ చిత్రాలను ముద్రించారని తెలిసి మనం తెగ బాధపడి పోయాము. ఖుష్బూ అనేవీర వనిత తన చీరపై రకరకాల దేవుడి బొమ్మలని ముద్రించికుని ప్రదర్శించింది. అరవ వాళ్ళు, ఈ అహంకారిని దేవతగా కొలుస్తూ ఆరాధిస్తారు. ఆవిడ నటనకి అంగాంగ ప్రదర్సానకి ముఘులైన అభిమానులు ఆవిడగారికి తమిళనాడులో గుడి కూడా కట్టించి ధూప దీప నైవేద్యాలతో నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. మరి, నిన్న హేమ మాలిని గారి అమ్మాయి సాక్షాతూ కలియుగ దైవం  సన్నిధిలో   తను ఎంతో భక్తితో వీపుపై వేయించుకున్న"గాయత్రీ మంత్రం" పచ్చబొట్టు ప్రదర్శించింది.
 
పచ్చబొట్టు వీపు మీద వేయించుకున్న ఉద్దేశం ఫది మందికి కనపడాలనే కదా? ఆ తలంపులో భాగంగా ఆవిడ పెద్ద పెద్ద కిటికీలున్న దుస్తులు ధరించాల్సిన అవసరం వుంది. ఈ విధంగా పాపం స్వామీ కార్యం స్వకార్యం నేరవేరినట్లయింది. ఎవరైనా హిందూ సంఘాలు నిరసన తెలియచేస్తే, అక్కడనుంచి మొదలవుతారు కుహనా లౌకిక వాదులు, అతి ప్రజాస్వామిక వాదులు వ్యక్తి స్వేచ్ఛకు అడ్డం వస్తున్నారని. హిందూ దేవుళ్ళ రూపాలని అవమానించే ఇలాంటి సౌందర్య ప్రదర్సనలని నిషేదించాల్సిన అవసరం ఎంతైనా వుంది. 
 
    
చరిత్రలో హిందువులు పొరుగు దేశాలమీద దండయాత్ర చేసినట్లుగాని, వాళ్ళ మత చిహ్నాలు కూల్చినట్లు గాని లేదు. ఎందుకంటే మనకు పరమత సహనం ఎక్కువ. కానీ మన మతస్తులే అడ్డూ ఆపు లేకుండా హిందూ మతం పరువు ప్రతిష్టలని బజారుకు ఈడుస్తుంటే  వీళ్ళని ఏమనాలి?? ఆలోచించండి.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి