14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఆప్(ప) సోపాలు


క్రేజీవాల్ - గత సంవత్సరం నుంచి రాజకీయ ముఖచిత్రం పై 'మార్పు' తీసుకొస్తానని ధిల్లీ వీధుల్లో బోల్తా పడ్డాడు.   ఈ మార్పు అనే పదం వాడిన రాజకీయ నాయకుడు ఎవ్వడూ ఎక్కువ కాలం పార్టీని నడపలా!    చిరు జీవి గెలిచిన ఐదు నెలలకు బోర్డు మార్చేస్తే, కేజ్రీవాల్ గారు యాభై రోజులలోనే మార్పు తెచ్చారు.   గెలిచిన 15 రోజులకే కాంగ్రెస్ కబంధ హస్తాలలో చిక్కుకొని ఆప సోపాలు పడి  ఐదు వారాలకే విల విల లాడుతున్నాడు.  బాబు గారి నోట్లో మట్టి కొట్టి  చిరంజీవి కూడా ఠాగూర్ (ఈ పేరు బాగా వత్తి పలకండి) పేరిట సినిమా తీసి, రిటైల్ స్థానాలు గెలిచి, హోల్ సేల్ గా అమ్మ గారి ముందు సాగిల పడ్డాడు. క్రేజీ వాల్  కూడా తన శక్తి వంచన లేకుండా భాజపా ను ఓడించి, కబంధ హస్తం సాయంతో ధిల్లీ పీఠాన్ని ఎక్కాడు.   హస్తం చేతికి చిక్కి, నోరు మూసుకొని వుండక లోక్ పాల్ బిల్లు, దీక్షిత్ పై విచారణ అంటూ విర్ర వీగితే కాంగ్రెస్ మార్షల్ లాంటి గవర్నర్ ఊరుకుంటాడా!  అప్పటి దాకా కాంగ్రెస్ ను నిందించి, అధికార వ్యామోహానికి లోనై పదవి అలంకరించిన రోజు నీ బుద్ధి ఏమైంది.  

క్రేజీ బాబు- బాగా వేగంగా పరుగెత్తే రైలు మార్గం వెయ్యాలంటే, ఉన్న మార్గాన్ని ముందు పీకేస్తే జనం ఊరుకోరు.   మన నేతి బీర కాయ ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు రావాలి. గవర్నర్లు, స్పీకర్లు, అధికార్లు  పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించటం మొదలు పోవాలి. అధికారంలోకి వచ్చిన సత్వరం తమ ఆస్తులను త్యజించాలి.  ఒక సారి ఎన్నికైన వాడు రెండో సారి పోటీ చెయ్య కూడదు.  అనువంశిక పాలన పోవాలి. దీనికి ఇంకో ఐదు దశాబ్దాలు పట్టవచ్చు.  అప్పటి దాకా సర్డుకుబోవటం నేర్చుకుంటే పది కాలాల పాటు అధికారంలో వుండి నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.     

1 కామెంట్‌ :