16, జులై 2013, మంగళవారం

ఐదు రూపాయల టిక్కెట్టుకు కారణాలు ఐదు


మోడీ గారి ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలుచుకున్న అభిమానులకు కేవలం ఐదు రూపాయల టికెట్ పెట్టారు భాజపా వారు.      దీని వెనుక ఐదు కారణాలుండవచ్చు, అవేంటో చూద్దాం: 


అ) సభానంతరం భాజపా రాష్ట్ర పార్టీ వారు, విలేకరుల సమావేశం పెట్టి, మొత్తం కలెక్షన్ 25 లక్షలు వచ్చింది అంటే, 5 లక్షల మంది స్వచ్చందంగా హాజరయ్యారు అని చెప్పుకోవడానికి కావచ్చు 

ఆ) ఈ పేరుచెప్పి 25 లక్షల నల్ల ధనాన్ని తెల్ల ధనం చెయ్యడానికి అయి ఉండచ్చు 

ఇ) మోడీ గారు ఏర్పాటు చేసుకున్నారని చెప్ప బడుతున్న విదేశీ ప్రమోషన్ సంస్థల సూచన కావచ్చు 

ఈ) వేరే పార్టీ వారు సభలు పెడితే జనాన్ని డబ్బులిచ్చి తరలిస్తారు అదే మోడీ గారి సభలకు జనం ఎదురు కట్నం ఇచ్చి వస్తారు అని ప్రచారం చేసుకోవడానికి కావచ్చు 

ఉ) ఈ ఐదు రూపాయల టిక్కెట్టు సగం ముక్క మీ దగ్గర ఉంచుకోండి, చివరాఖరన లక్కీ డిప్పు ద్వారా విజేతని ప్రకటిస్తామని చెప్పవచ్చు 


ఇంతక మించి నాకేమీ కారణాలు కనపడట్లేదు. 
      


6 కామెంట్‌లు :

  1. వచ్చిన మొత్తాన్ని ఉత్తరాఖండ్ వరద భాదితులకు ఇస్తారుట. ప్రతిది వ్యతిరేక దృష్టి తో ఎందుకు చూడదం.

    రిప్లయితొలగించండి
  2. అసలు కారణం ఉత్తరాఖండ్ వరద భాదితులకు చేయూతనివ్వడం.

    రిప్లయితొలగించండి
  3. లారీలమీద ఎదురుడబ్బులిచ్చి తండోపతండాలుగా జనసమీకరణ చేయకుండా, నరేంద్ర మోడి సభకు ఐదు రూపాయలు టికెట్ పెట్టి వచ్చిన డబ్బును ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఇవ్వబోవడం మంచిపనే కదా!

    రిప్లయితొలగించండి
  4. >ఉత్తరాఖండ్ వరద భాదితులకు చేయూతనివ్వడం
    ఆ ముక్క వాళ్ళు 5 రూపాయలు ప్రకటించినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు వేరేవాళ్ళు యాగి చెయ్యంగానే ఉత్తరాఖండ్ అని చెబుతున్నారు?

    రిప్లయితొలగించండి
  5. Your comment seems to be highly prejudiced. Those who are willing to pay 5 Rs. only will come. There is no compulsion.When the money is intended for good cause, we should appreciate. At least we should keep quiet.

    రిప్లయితొలగించండి