5, జూన్ 2013, బుధవారం

బిల్డర్ల మోసాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి


అరచేతిలో తీర్ధం పోసి మోచేత్తో నాకిస్తారు అనే పాతకాలం సామెత బిల్డర్లకు బాగా వర్తిస్తుంది.   కేంద్ర ప్రభుత్వం బిల్డర్ల మోసాలపై ఎట్టకేలకు కొన్ని కఠిన చర్యలను ప్రతిపాదించ దలచుకోవడం ఆహ్వానించతగ్గ పరిణామం.   స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత మధ్య తరగతి ప్రజల పక్షాన నిలబడదలచుకోవడం సంతోషం. 

సాధారణంగా బిల్డర్లు చేసే మోసాలు : 

1) బ్రోచర్లో చూపించే విషయాలకు వాస్తవానికి పొంతన లేక పోవడం 
2) కామన్ ఏరియా పేరిట 25-30 శాతం వరకు అదనంగా వసూలు చెయ్యడం 
3) ప్రభుత్వ అనుమతి పొందిన ప్లానుకు, తను కట్టిన ఇంటి ప్లానుకు తేడా వుండటం 
4) బాంకులతో కుమ్మక్కై వినియోగదారుడి మీద ఒత్తిడి పెంచి పూర్తైన పనికన్నా ఎక్కువ డబ్బులు తీసుకొని 
    వడ్డీల దెబ్బతో పీడించడం 
5) లిఫ్ట్, జనరేటర్, విద్యుత్ సామాగ్రి, సానిటరీ సామాన్ల బ్రాండ్ ల గురించి చెప్పింది చెయ్యక పోవడం లేదా 
    నాణ్యత తక్కువ వున్నా వస్తువులను అమర్చడం 
6) అమ్మకం పన్నును 8 శాతం కొనుగోలుదారుడి నుంచి వసూలు చేసి, ప్రభుత్వానికి జమ చెయ్యక పోవడం 
7) ఆస్తి పత్రాలకు సంబంధించిన లోపాలు 
8) అనుకున్న సమయానికి కట్టడాన్ని అందివ్వక పోవడం 
9) ఆస్తిని అమ్మిన తరువాత దానిలో వచ్చే లోపాలకు బాధ్యత వహించక పోవడం 
10) వాహన పార్కింగు స్థలం ఏ ప్రాతిపదికన చేస్తారో చెప్పాలి 
వీటన్నిటికీ పరిష్కారం - అంబుడ్స్మెన్ 

- బీమా కంపెనీల తరహాలో ఒక అంబుడ్స్మెన్ ను ప్రభుత్వం నియమించాలి 
- బిల్డర్ వివరాలను అంతర్జాలంలో వుంచి, ఆ కంపనీ గతంలో చేపట్టిన బిల్డింగ్స్ తాలూకు వివరాలు ఉంచాలి 
- ప్రతి ఖాతాదారుడి నుంచి తనకు సకాలంలో, అందించిన వివరాల మేరకు ఫ్లాట్ ను ఎలాంటి ఇబ్బంది లేకుండా 
   ఇచ్చినట్లు బిల్డర్ సర్టిఫికేట్ తీసుకోవాలి 
- కట్టుబడిలో లోపాలు వున్నట్లు భవిష్యత్లో నిర్ధారణైతె,  బిల్డర్ను బాధ్యుడని చెయ్యాలి 
- నిభందనలకు వ్యతిరేకంగా కట్టే నిర్మాణాలకు భవిష్యత్లో జరిగే నష్టాన్ని బిల్డర్ భరించాలి 

ధరలు కొంచెం పెరిగినా, కఠినమైన నిబంధనల ద్వారా  అక్రమ మార్గాల ద్వారా గొప్ప వాళ్ళు కావాలనుకొనే బిల్డర్లకు గుణపాఠం కావాలి. 


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి