2, ఫిబ్రవరి 2013, శనివారం

తిట్ల దండకం వలన జరిగిన మేళ్ళు

మనకు తెలుగులోను సంస్కృతంలోను బోలెడు దండకాలు వున్నాయి. ఇవన్నీ భగవంతుణ్ణి కొలవడానికి వివిధ మార్గాలు. ఉదా|| కాళికా దేవి మీద మనకందరికీ తెలిసిన దండకం కుచోన్నతే కుంకుమ రాగ సొణె.... అలాగే పింగళి సూరన గారి కళా పూర్ణోదయంలో శ్రీకృష్ణుని  మీద శ్రీ కామినీ కామి తా కార సాకార కారుణ్య ధారా.....  ఈ కోవలోకి వస్తాయి 


ఇటీవల మన క చ రా గారు కూడా ఇందిరా పార్కులో చదివిన తిట్ల దండకం మాత్రం ఈ కోవకు చెందదు. నిజంగా భగవంతుడు తెలుగు ప్రజల మీద జాలి పడి ఉండచ్చు, అందుకే నన్నయ్య, కరుణశ్రీ లాంటి కవులను "సన్నాసులు" అనకుండా కచరా గారు పెద్ద మనసుతో క్షమించారు. ఈ ప్రమాదం ముందు ముందు లేకపోలేదు కానీ, ప్రస్తుతానికి తప్పించుకున్నట్లే.

కానీ వీరి దండకం వల్ల సమైక్య రాష్ట్రం కోరుకొనేవారికి పరోక్షంగా మేలు చేశారని చెప్పవచ్చు. మరి క చ రా గారికి కావాల్సినిది కూడా 2014 దాకా రాష్ట్రం సమైక్యంగా ఉంచడమే. ధర్మరాజు ఆస్తి మొత్తాన్ని ఫణంగా పెట్టి జూదం ఆడితే, మన తెలంగాణా అధర్మ రాజు తనపై విశ్వాసం ఉంచిన ప్రజల ఆశల్ని ఫణంగా పెట్టి 2014 దాకా వాయిదా వేసారు. రాజకీయాలలో పూర్తీ కాలం మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. జగన్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు (క్షమించాలి - కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీతో అని చదువుకోండి) కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తామని తే రా స ని తనలో ఐక్యం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే కనీసం ఒక సంవత్సరం పడుతుంది. 2014 ఎన్నికలలో ఎన్ డి ఎ తెలంగాణాని పువ్వులలో పెట్టి ఇస్తుంది అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కి జగన్తో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా చేసారు. జగన్తో కాంగ్రెస్ కలవడం ద్వారా తెలంగాణాకి ఎలా లాభం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. రాజకీయం అంటే అదే మరి. 
 
 
ఇవన్నీకాంగ్రెస్ పార్టీకి,సమైక్య వాదానికి కచరాగారు అయాచితంగా  కల్పించిన
కొన్ని మేళ్ళు.  

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి