2, ఫిబ్రవరి 2013, శనివారం

ఉద్యమాలు - ఉద్యోగాలు

క చ రా గారు మాటల యుద్ధం తరువాత తిరిగి ఫాం హౌసులో సేద తీరుతున్నారు. బహుశః ఇది కూడా వ్యూహాత్మక మౌనంలో భాగం కావచ్చును.
 
 
విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా ఫిబ్రవరి మొదలు ఏప్రిల్ నెల వరకు ఎలాంటి ఉద్యమాలు ఉండక పోవచ్చు. మళ్ళీ మే నుంచి మొదలయ్యే అవకాశం వుంది. తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని చెన్నై, బెంగళూరు, గుర్గామ్ ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారాంతాలలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువవడంతో రైళ్ళు, బస్ నిలయాలు, తెలుగు వారి ముచ్చట్లతో కళ కళలాడు తున్నాయి. బెంగళూరు నగరంలో చైతన్య విద్యా సంస్థలు దాదాపు 10 శాఖలు గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు.

 
ఈ లోపు జగన్ గారు కాంగ్రెస్కు జై అని పుణ్యం కట్టుకుంటే, కధ కంచికి చేరినట్లే.   ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఏది ఏమైనా, ఈ అనిశ్చితికి తెరపడడానికి మనందరం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే. ఈ సారి ఎన్నికలలో కూడా తె రా సాకి ఓటమి ఎదురైతే, పార్టీని అమ్మేయడం ఖాయం.

 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి