5, ఫిబ్రవరి 2013, మంగళవారం

బ్రదర్ అనిల్ పై ఆరోపణలు కొత్తవా!


క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ గురించి, భాజపా ప్రభాకర్ గారు "సంచలనాత్మక" విషయాలు బయటపెట్టారు. ఇతనిగురించిన విషయాలు ఈనాడు, జ్యోతి పత్రికలు ఎప్పుడో బహిర్గతం చేశాయి. కానీ భాజపా వారు ఈ పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు బయట పెట్టడానికి కారణాలు చూద్దాము --

అ) జగన్ కాంగ్రెస్తో గొడవ పడుతూ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న
సందర్భంలో కర్ణాటకలోని తమ పార్టీకి చెందిన "ఘనులు" ద్వారా రెచ్చగొట్టి కాంగ్రెస్ను బలహీనం చేయడానికి ప్రయత్నించింది.   దీనికి భాజపా కేంద్ర  
నాయకత్వం కూడా సుముఖత చూపించింది. కానీ, అప్పటికే జగను పై పెరుగుతున్నఆరోపణల వల్ల భాజపా ఆంద్ర నాయకత్వం వ్యతిరేకించింది.
 
 
ఆ) ప్రస్తుతం అనిల్ గారి భార్య తెలంగాణలో యాత్ర చెయ్యడానికి సిద్ధమైంది. కేవలం ఒక ప్రాంతానికి మాత్రమె పరిమితమై ప్రజా సమస్యలపై పెద్దగా అవగాహన లేని భాజపాకు ఒక సంచలనాత్మక విషయం కావాలి,వార్తలలో
నానుతూ వుండాలి. అయాచితంగా అందివచ్చిన ఈ అవకాశం భాజపా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.


ఇ) తెలంగాణాపై పేటెంట్ హక్కుల విషయంలో జరుగుతున్న పోటీలో భాజపా తె రా సకు తోకగా మాత్రమె మిగిలింది. తెరాస "జాక్" దెబ్బకు పోటీలో భాజపా
బాగా వెనుకబడింది.  ఏదో ఒక విషయం మీద ప్రజలలో ఉండాలి అనే తపన.  


ఈ) ఇన్ని ఆధారాలు వున్నా భాజపా,  అనిల్ మీద కేసు పెట్టకుండా ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమే సి బి ఐ ని, కాంగ్రెస్ని డిమాండ్ చేస్తుంది.
కేవలం ప్రచారం కోసమే  ఈ తపనలా కనిపిస్తుంది.   


ఇంత అవినీతి చరిత్ర వున్న అనిల్ బావ మరిది పార్టీ మద్దతు, కర్ణాటకలో ఘనుల మద్దతు, జర్ఖండులో అవినీతి పరుల మద్దతు ఎట్టి పరిస్తితులలో తీసుకోబోమని భాజపా ప్రకటించ గలదా!




.

3 కామెంట్‌లు :

  1. మళ్ళీ మొదలయ్యింది దరిద్రం, చెడ్డవాడిని చెడ్డవాడు అని చెబితే నువ్వు చేద్దవాడివి కాదా అని అడగడం ఏమి గొప్పో అర్ధం కాదు.
    అయినా నువ్వు వాడిని మంచి వాడు అంటే సరిపోదు.
    నేనెంతో నువ్వూ అంతే.

    రిప్లయితొలగించండి
  2. నేను అనిల్ మంచి వాడు నా వ్యాసంలొ వ్రాయలేదు. అతనిపై బోలెడు ఆధారాలతో పత్రికలలో గతంలోనే కధనాలు వచ్చాయ్. అప్పుడు, భాజపా వారు జగన్-ఘనులతో సంబంధాలు పెట్టుకుంటె వుండే లాభ నష్తాలు బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పుడైనా అనిల్పై ఆధారాలతో కేసులు పెట్టమని వ్రాశాను. అంటే అనిల్ను సపోర్టు చేసినత్లా? దయ చేసి పూర్తి వ్యాసాన్ని చదవమని విఞ్ప్తి.

    రిప్లయితొలగించండి
  3. అవి బి.జె.పి ప్రభాకర్ ఆరోపణలు కావు.వాటిని చేయిస్తుంది టి.డి.పి పార్టి.ఎందుకంటే శర్మిల పాదయాత్రకు వచ్హిన ప్రజా స్పందన చూసి టి.డి.పి.భయ పడుతూ ఉంది.అక్కడ క్రైస్తవ మతం ఉంది కాబట్టి టి.డి.పి ఆరోపణలు చేస్తే వాల్లకు ఓట్లు పోతాయని తమ లౌకిక(బి.జె.పి. తో పొత్తు పెట్టుకున్నప్పుడే ఆ ముద్ర పోయింది.అది వేరే విశయం) ముద్ర పోకుండా ,తమ పాత స్నేహితులతో ఆరోపణలు చేయిస్తుంది.ఎలాగూ బి.జె.పి. వాల్లకు మైనారిటీ ల ఓట్ల మీద ఆశ లేదు.

    రిప్లయితొలగించండి