19, ఫిబ్రవరి 2013, మంగళవారం

త్వరలో తేలనున్న తెలుగు ఓటరు మనోగతం

 
దేశ  అత్యున్నత న్యాయ స్థానం తీర్పు దరిమిలా, పంచాయతీలు, నగర పాలక సంస్థలకు జరగవలసిన ఎన్నికలకు మార్గం సుగమమైంది.
 
 
స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు రసాయన పరీక్ష లాంటిది.   ఈ ఎన్నికల ఫలితాలు 2014లో జరగబోయే సార్వత్రిక  ఎన్నికలకు  సూచిక లాంటిది.    స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాదిపదికపై జరుగుతాయి కనుక ఓటరు మనోగతాన్ని విశ్లేషించడానికి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం దొరుకుతుంది.   ఈ ఫలితాల ఆధారంగా, రాబోయే సాధారణ ఎన్నికలలో పెట్టుకోవలసిన పొత్తులు,సర్దుబాట్లు మరియు దిద్దుబాట్లు చేసుకొనే అవకాశం వుంది.     
 
 
ఇటీవల జరిగిని కేంద్ర సహకార బ్యాంకు మరియు మార్కెట్ సంఘాల ఎన్నికలకు, మే లో జరగబోయే  స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా వ్యత్యాసం వుంది.    ఈ ఎన్నికలు కాంగ్రెస్ తెదేపా కన్నా తెరాస మరియు వైఎసార్ పార్టీల మనుగడను నిర్ణయించే అవకాశాలు మెండుగా వున్నాయి. 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి