19, ఫిబ్రవరి 2013, మంగళవారం

సార్వత్రిక సమ్మె నష్టం అక్షరాలా రు॥ 20,000 కోట్లు ??


అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.    ఈ నెల 20 మరియు 21న జరప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఖరీదు షుమారు 20,000 కోట్ల  రూపాయలు.    ఆర్ధిక మాంద్యంతో దిక్కుతోచని స్థితిలో వున్న పరిశ్రమలకు ఈ సమ్మె గొడ్డలిపెట్టు లాంటిది అంటే అతిశయోక్తి కాదు.    అసలే ఈ నెలలో కేవలం 23 పనిదినాలు మాత్రమె ఉండగా పులిమీద పుట్రలా ఈ 48 గంటల సమ్మె పారిశ్రామిక రంగానికి  ఏ మాత్రం  ప్రయోజన కరంగా    లేదు.    ఈ నష్టాన్ని సామాన్య ప్రజలపైనే భారం మోపడం ఖాయం.  


భారత దేశ చరిత్రలో సార్వత్రిక సమ్మెల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచి ప్రభుత్వ నిర్ణయాలను ఉపసంహరించిన దాఖలాలు లేవు.    ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి నిరసనలు, ధర్నాలు, సత్యాగ్రహాలు లాంటి ఎన్నో మార్గాలు వున్నాయి.   ఈ సమ్మె కేవలం రానున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న సమ్మెగా చూడాల్సి వస్తుంది.  


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి