26, ఫిబ్రవరి 2013, మంగళవారం

జైలు దారి పడుతున్న శాసన సభ సభ్యులు


ఏదైనా   మంచిపని చేయాలంటే ముందుగా మనం ఏ గుడికో, పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్లి ఆశీర్వాదం తీసుకొని, తలపెట్టిన కార్యక్రం నిర్విఘ్నంగా సాగాలని ఆశించడం సహజం.     గత సంవత్సర కాలంగా, పదవిలో మరో ఐదు సంవత్సరాలు కొనసాగాలని కోరుకొనే ప్రతి శాసన సభ సభ్యుడు, పదవిలోకి రావాలనుకొనే మాజీలు, నాయకులు చెంచల్ గూడాకు వెళ్లి  మొక్కు తీర్చుకుంటున్నారు.   


పెద్ద కారు, మందీ మార్బలం జైలు వైపు వెళ్తున్నారంటే, ఇంకో సభ్యుడు కాంగ్రెస్ నుంచో తెదేపా నుంచో జారినట్లు అర్ధం చెసుకొవాలి.   జైలులోని వ్యక్తీ అంత  సులభంగా బయటకు రాడు  అని తెలిసి కూడా ఏ నమ్మకంతో ఆయనతో చేయి కలుపుతున్నారో అంతు  పట్టని చిదంబర రహస్యం.   జైలులో ఆయనతో సమావేశమైన ప్రతి నాయకుడు బయటికివచ్చి రాజశేఖర్ రెడ్డి పధకాల గురించి, కిరణ్ కుమార్ గారి అసమర్ధత గురించి, బాబు గారి రెండు నాలుకల గురించి మూడు ముక్కలు చెప్పి ప్రశాంతంగా వెళ్లి ప్రస్తుతం తను వున్న పార్టీకి రాజీనామా చెస్తాడు.  


సాధారణంగా పత్రికా విలేఖరులు, ఓ బి వాహనాలు వారి హడావుడి అంతా  పార్టీ ప్రధాన కార్యాలయాల వద్దా, ముఖ్యమంత్రి నివాసం వద్దా వుండటం సహజం.    కానీ గత కొంత కాలంగా చంచల్ గూడా జైలు వద్ద కూడా ఈ హడావుడి ఎక్కువైన్ది.      ఈ జైలు వున్న  ప్రాంతానికి చెంచల్ అని పేరు ఎవరు పెట్టారో కానీ, ఆ పేరు అక్కడకు వస్తున్న నాయకుల మనస్తత్వానికి అద్దం పడుతోంది.  

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి